Mehul Choksi : బెల్జియంలో మెహుల్​ చోక్సీ అరెస్ట్​- భారత్​కు అప్పగింత ఎప్పుడు?-mehul choksi arrested in belgium on indias extradition request ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mehul Choksi : బెల్జియంలో మెహుల్​ చోక్సీ అరెస్ట్​- భారత్​కు అప్పగింత ఎప్పుడు?

Mehul Choksi : బెల్జియంలో మెహుల్​ చోక్సీ అరెస్ట్​- భారత్​కు అప్పగింత ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

Mehul Choksi : వ్యాపారవేత్త మెహుల్​ చోక్సీని బెల్జియంలో అరెస్ట్​ చేశారు. రూ.13,500 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఆయన్ని భారత్​కు తీసుకొచ్చేందుకు ఇక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మెహుల్​ చోక్సీ (AP Photo)

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ 'మోసం' కేసులో భారతదేశం చేసిన అభ్యర్థన మేరకు పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యాపారవేత్త తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి దేశంలోని ఆంట్వెర్ప్​లో నివసిస్తున్నట్లు మీడియా నివేదికలు ధృవీకరించిన కొన్ని వారాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.

వజ్రాల వ్యాపారిని శనివారం అరెస్ట్​ చేసినట్టు తెలుస్తోంది. ఇంటర్​పోల్​ ఆయన అరెస్ట్​పై రెడ్​ నోటీస్​ని డిలీట్​ చేసిన అనంతరం, భారత్​కు చెందిన ఈడీ, సీబీఐలు బెల్జియం అధికారులకు మెహుల్​ చోక్సీ అప్పగింత కోసం అభ్యర్థన చేసినట్టు, ఆ తర్వాతే ఈ అరెస్ట్​ జరిగినట్టు సమాచారం.

మెహుల్​ చోక్సీని భారత్​కు అప్పగించాలని అధికారులు బెల్జియం అఫీయల్స్​ని అడిగినట్టు మార్చ్​లో కూడా పలు నివేదికలు బయటకు వచ్చాయి.

ఎవరీ మెహుల్ చోక్సీ?

గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకుడు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) మోసం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీకి 2023 నవంబర్ 15న బెల్జియంలో రెసిడెన్సీ లభించింది.

రూ.13,500 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో భారత్​లో వాంటెట్​గా ఉన్న మెహుల్ చోక్సీ గతంలో ఆంటిగ్వా, బార్బుడాలో ఉంటూ బెల్జియంకు మకాం మార్చాడు.

ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరసత్వం కలిగి ఉన్నారు.

అసోసియేటెడ్ టైమ్స్ కథనం ప్రకారం మెహుల్ చోక్సీ బెల్జియంలో ఉండేందుకు 'ఎఫ్ రెసిడెన్సీ కార్డు' పొందాడు. అయితే, ఆయన నివాసాన్ని పొందడానికి, భారతదేశానికి అప్పగించకుండా తప్పించుకునే ప్రయత్నంలో తప్పుడు డిక్లరేషన్లు, నకిలీ పత్రాలతో సహా తప్పుదోవ పట్టించే విధంగా కల్పిత పత్రాలను బెల్జియం అధికారులకు సమర్పించాడు.

మెహుల్ చోక్సీ తన భారతీయ, ఆంటిగ్వా పౌరసత్వాలను వెల్లడించడంలో విఫలమయ్యాడని, దరఖాస్తు ప్రక్రియలో తన జాతీయతను తప్పుగా చూపించాడని సమాచారం.

స్విట్జర్లాండ్​లోని ఓ ప్రముఖ క్యాన్సర్​​ ఆసుపత్రిలో చికిత్స కోసం మెహుల్​ చోక్సీ ఆ దేశానికి వెళ్లే యోచనలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. క్యాన్సర్​ ఉందనే అనుమానంతో చికిత్స కోసం ఆయన బెల్జియంకు వెళ్లినట్టు ఫిబ్రవరిలో ఆయన తరఫు న్యాయవాది ముంబై కోర్టుకు తెలిపారు.

మెహుల్ చోక్సీ తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ పొంది నేరం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నీరవ్ మోదీ లండన్ జైలులోని ఉన్నాడు. అనేక బెయిల్ తిరస్కరణల తరువాత ఆయన్ని భారతదేశానికి అప్పగించడానికి పోరాటం కొనసాగుతోంది.

మెహుల్ చోక్సీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా (ఎఫ్ఈఓ) ప్రకటించాలన్న ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనను ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు విచారిస్తోంది.

నీరవ్ మోదీని 2019లో ఎఫ్ఈఓగా ప్రకటించగా, మెహుల్ చోక్సీపై ఈడీ పిటిషన్ 2018 నుంచి పెండింగ్​లో ఉంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.