What happens after death : మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు.. బాలుడు ఆత్మహత్య!
యూపీ మీరట్లో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? అని తెలుసుకునేందుకు అతను సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఉత్తర్ప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఇదీ జరిగింది..
ఉత్తర్ప్రదేశ్ మీరట్లో గత శనివారం రాత్రి జరిగింది ఈ ఘటన. కుటుంబ సభ్యుల ముందే 15 ఏళ్ల బాలుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువరాజ్ రాణా అనే బాలుడు మరణానంతర జీవితంపై కుతూహలంతో ఈ దారుణానికి ఒడిగట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు!.
“మరణం తర్వాత ఏం జరుగుతుంది?”, “మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది?”, “గరుడ పురాణం”, “ఎలా చావాలి?” వంటివి బాలుడు ఆన్లైన్లో సెర్చ్ చేశాడు.
కాగా ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అధికారులు ధృవీకరించారు.
కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) ధర్మేంద్ర కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ఎస్హెచ్ఓ కుమార్ మాట్లాడుతూ.. “బాలుడు ఆత్మహత్య చేసుకున్న చోట తుపాకీని స్వాధీనం చేసుకున్నాము. తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము,” అని అన్నారు.
చెడు సావాసాలకు వెళుతున్నందుకు ఆ బాలుడిని తల్లి, సోదరుడు మందలించారు. అనంతరం యువరాజ్ మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. అతని బైక్ని కూడా కుటుంబ సభ్యులు అమ్మేశారని, ఇది అతన్ని మరింత ఆందోళనకు గురిచేసిందని వెల్లడించారు.
పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, తదుపరి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకుని..
మరో ఘటనలో ఉత్కల్ సంగీత మహావిద్యాలయకు చెందిన 12వ తరగతి విద్యార్థిని జనవరి 13న హాస్టల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మృతురాలిని కేంద్రపారా జిల్లాకు చెందిన ఉత్కలికా స్వైన్గా పోలీసులు గుర్తించారు. స్వైన్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
ఇంకో ఘటనలో మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ నగరంలో 26 ఏళ్ల కాలేజీ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
సంబంధిత కథనం