దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. యూపీ మీరట్లో సౌర్భ్ రాజ్పుట్ని హత్య చేసినట్టు అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఇందులో భాగంగానే అసలేం జరిగిందో వివరించారు.
ముస్కాన్ రస్తోగి- సాహిల్లు ఒకటే స్కూల్లో చదివారు. అయితే 2019లో వాట్సాప్ గ్రూప్లో స్కూల్ ఫ్రెండ్స్ రీ-కనెక్ట్ అయ్యారు. వీరందరు కలిసి మీరట్లోని ఓ మాల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పార్టీలోనే ముస్కాన్- సాహిల్లు కలుసుకున్నారు. ఇది అఫైర్కి దారి తీసింది. కానీ ముస్కాన్కి సౌరభ్ రాజ్పుట్తో వివాహం జరిగింది. కాగా.. ఉద్యోగం రిత్యా సౌరభ్ లండన్లో ఉండేవాడు. ఫలితంగా కొత్త అఫైర్ బాగా బలపడింది.
వీరి బంధం వెనుక డ్రగ్స్ కోణం కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సాహిల్ డ్రగ్స్ తీసుకునేవాడని, ముస్కాన్కి కూడా ఇచ్చేవాడని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు.
ఇక తమ రిలేషన్కి రాజ్పుట్ అడ్డొస్తాడని భావించి.. అతడిని చంపేయాలని ముస్కాన్ నిర్ణయించుకుంది. ఇందుకు సాహిల్ కూడా సాయం చేశాడు. ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ రూపొందించారు.
మార్చ్ 3న సౌరభ్ ఇంటికి వచ్చాడు. తనతో పాటు కోఫ్తా తీసుకొచ్చాడు. అదే సరైన సమయం అని భావించిన ముస్కాన్.. కోఫ్తాని పెనం మీద పెట్టి వేడి చేసి, అందులో మత్తుపదార్థాలు కలిపింది. అది సౌరభ్కి ఇచ్చింది. అది తిన్న సౌరభ్ స్పృహ కోల్పోయాడు. వెంటనే సాహిల్కి కాల్ చేసింది ముస్కాన్. ఇద్దరు కలిసి కత్తితో సౌరభ్ని చంపేశారు. ఆ తర్వాత సౌరభ్ మృతదేహాన్ని సాహిల్ బాత్రూమ్కి తీసుకెళ్లాడు. రేజర్తో సౌరభ్ తల, చేతులు కోశాడు.
శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి పాలిథీన్ బ్యాగ్స్లో పెట్టి, నగరం మొత్తం విసిరేయాలని ఇద్దరు ప్లాన్ చేశారు. పాలిథీన్ బ్యాగ్స్లో సౌరభ్ ఛాతిభాగం పెట్టారు. ఆ తర్వాత.. బెడ్రూమ్లోని డబుల్ బెడ్ కింద ఉన్న బాక్స్లో ఆ బ్యాగ్స్ పెట్టారు. ఆ రోజు రాత్రి.. కింద మృతదేహం ఉండగా, ముస్కాన్ అదే బెడ్పైన పడుకుంది. మరోవైపు సౌరభ్ తల, చేతులను సాహిల్ తన ఇంటికి తీసుకెళ్లాడు.
మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుట్ శరీరాన్ని మాయం చేసేందుకు తొలుత వేసిన ప్లాన్ని మార్చ్ 5 నాటికి ఇద్దరు పక్కన పెట్టేశారు. ఘంటాగఢ్ నుంచి డ్రమ్ తీసుకొచ్చారు. స్థానిక మార్కెట్లో సిమెంట్ కొన్నారు. ముస్కాన్ నివాసంలో సౌరభ్ మిగిలినపోయిన అవయవాలను డ్రమ్లో వేశారు. సాహిల్ కూడా తాను తీసుకెళ్లిన వాటిని వెనక్కి తీసుకొచ్చి ఆ డ్రమ్లో వేసేశాడు. ఆ తర్వాత సిమెంట్ పోసి డ్రమ్ని సీల్ చేసేశారు.
సినిమాల్లో చూసి ఈ విధంగా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
సాహిల్- ముస్కాన్లు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. మీరట్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు నిందితులకు కఠిన శిక్ష విధించాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత కథనం