Meerut murder : ‘భోజనం వద్దు.. గంజాయి కావాలి’- పోలీసులనే డ్రగ్స్​ అడిగిన నిందితులు-meerut murder accused refusing food demanding marijuana morphine in jail ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Meerut Murder : ‘భోజనం వద్దు.. గంజాయి కావాలి’- పోలీసులనే డ్రగ్స్​ అడిగిన నిందితులు

Meerut murder : ‘భోజనం వద్దు.. గంజాయి కావాలి’- పోలీసులనే డ్రగ్స్​ అడిగిన నిందితులు

Sharath Chitturi HT Telugu

Meerut murder case : సౌరభ్​ రాజ్​పుట్​ మీరట్​ మర్డర్​ కేసు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు జైలులో డ్రగ్స్​ డిమాండ్​ చేస్తున్నారని సమాచారం. భోజనం బదులు గంజాయి కావాలని అడిగినట్టు తెలుస్తోంది.

మీరట్​ మర్డర్​ కేసు నిందితులతో పోలీసులు.. (PTI)

మర్చెంట్​ నేవీ ఆఫీసర్​ సౌరభ్​ రాజ్​పుట్​కు సంబంధించిన​ మీరట్​ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. భర్తను హత్య చేసిన తర్వాత ముస్కాన్​ రస్తోగి, తన ప్రియుడు సాహిల్​ శుక్లాతో హిమాచల్​ ప్రదేశ్​కి వెళ్లి హోలీ వేడుకలు చేసుకున్న విషయం అందరిని షాక్​కి గురిచేసింది. ఇక ఇప్పుడు నిందితులు రిమాండ్​లో ఉన్న జైలు నుంచి మరికొన్ని షాకింగ్​ విషయాలు బయటకు వచ్చాయి. నిందితులు.. డ్రగ్స్​ కావాలని ఏకంగా పోలీసులనే అడిగినట్టు సమాచారం. డ్రగ్స్​ లేకపోతే భోజనం కూడా వద్దంటున్నారని తెలుస్తోంది. వీరిద్దరు తీవ్రమైన డ్రగ్​ అడిక్షన్​ సమస్యతో బాధపడుతున్నట్టు ఇది స్పష్టం చేస్తోంది.

‘భోజనం వద్దు- గంజాయి కావాలి..’

ఈ నెల 4న ముస్కాన్, ప్రియుడు సాహిల్​తో కలిసి, తన భర్త సౌరభ్​ను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచి సిమెంట్​తో నింపింది. ఆ తర్వాత ప్రేమికులు హిమాచల్​ప్రదేశ్​కు వెళ్లి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మీరట్​లో అసలేం జరగనట్టు.. వేడుకల్లో ఎంజాయ్​ చేశారు. లగ్జరీగా బతికారు. చివరికి డబ్బులు అయిపోవడంతో మార్చ్​ 17న మీరట్​కు తిరిగి వచ్చారు.

మర్చెంట్​ నేవీ ఆఫీసర్​ సౌరభ్​ రాజ్​పుట్​ హత్య బయటపడిన తర్వాత ముస్కాన్, సాహిల్​లను పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఇప్పుడు 27 ఏళ్ల నిందితులిద్దరూ మీరట్ జిల్లా జైలులో వేర్వేరు బ్యారక్​లలో ఉన్నారు. డ్రగ్స్​పై వారు ఆధారపడటం తీవ్రంగా ఉందని, వారిని వారు హాని కలిగించుకోకుండా, ఇతరులకు హాని చేయకుండా తగిన చర్యలు చేపట్టామని ఓ అధికారి చెప్పారు.

జైలులోకు వెళ్లిన తొలిరాత్రి నుంచే ముస్కాన్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు తీవ్రమైన మాదకద్రవ్యాల వ్యసనం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ముస్కాన్​కి అత్యవసర చికిత్స ప్రారంభించారు.

ఇంతలో సాహిల్ హంగామా సృష్టించి తనకు డ్రగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గంజాయి కావాలని హడావుడి చేశాడు. ముస్కాన్ కూడా తనకు మార్ఫిన్ ఇంజెక్షన్లు కావాలని డిమాండ్ చేసిందని అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.

వీరిద్దరూ క్రమం తప్పకుండా ఇంజెక్టెబుల్ డ్రగ్స్ వాడుతున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు ధృవీకరించారు.

మీరట్​ జైలులో డీ-అడిక్షన్​ సెంటర్​ ఉంది. ప్రస్తుతం మీరట్​ హత్య కేసు నిందితులు ఇద్దరు అందులోనే ఉన్నారు. వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు అక్కడ చికిత్స ఇస్తున్నారు. జైలుకు చెందిన వైద్య సిబ్బంది కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

ముస్కాన్, సాహిల్ నుంచి మాదకద్రవ్యాల కోసం తీవ్రమైన డిమాండ్ల మధ్య, ఇద్దరూ ఆహారాన్ని తిరస్కరించారని, ఇది విత్​డ్రావెల్​కి సాధారణ సంకేతమని వర్గాలు తెలిపాయి. ఇద్దరూ కొంత స్థిరత్వాన్ని తిరిగి పొందడానికి కనీసం పది రోజులు పట్టే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

మీరట్​ హత్య కేసు దేశవ్యప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.