Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది సజీవ దహనం
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలు కాగా.. 50 మందిని కాపాడారు.
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మూడు అంతస్తులు గల ఓ వాణిజ్య భవనంలో దట్టమైన మంటలు వ్యాపించడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 26 మృతదేహాలను గుర్తించగా.. 50 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో పలు సంస్థలు కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ వెల్లడించారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి
ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
టాపిక్