పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. ఈ నెల నుంచే వర్తింపు..-maruti suzuki to hike vehicle prices this month ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maruti Suzuki To Hike Vehicle Prices This Month

పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. ఈ నెల నుంచే వర్తింపు..

HT Telugu Desk HT Telugu
Apr 06, 2022 11:44 AM IST

మారుతీ సుజుకీ సంస్థ తన కార్ల ధరలను పెంచనుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే వర్తింపజేయనున్నట్టు తెలిపింది.

కొత్త బాలెనొ (ఫైల్ ఫోటో)
కొత్త బాలెనొ (ఫైల్ ఫోటో) (AFP)

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ఉత్పాదక ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ నెలలో తమ అన్ని మోడల్స్‌కు సంబంధించిన కార్ల ధరలను పెంచనున్నట్లు బుధవారం తెలిపింది. 

ట్రెండింగ్ వార్తలు

గత సంవత్సరం నుంచి వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల ధర ప్రతికూలంగా ప్రభావితం అవుతూనే ఉందని సంస్థ సెబీకి తెలిపింది. ‘కాబట్టి, అదనపు ఖర్చుల ప్రభావాన్ని ధరల పెంపు ద్వారా వినియోగదారులపై మోపడం కంపెనీకి అత్యవసరంగా మారింది’ అని సంస్థ తెలిపింది.

ఏప్రిల్‌లో ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. పెంపు మోడల్‌ను బట్టి మారుతూ ఉంటుంది. అయితే ప్రతిపాదిత ధరల పెంపు పరిమాణాన్ని కంపెనీ వెల్లడించలేదు. 

ఇన్‌పుట్ ఖర్చులు నిరంతరం పెరగడం వల్ల ఇప్పటికే జనవరి 2021 నుండి మార్చి 2022 వరకు వాహన ధరలను దాదాపు 8.8 శాతం పెంచింది. దేశీయ విపణిలో ఆల్టో నుండి ఎస్-క్రాస్ వరకు అనేక రకాల మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

WhatsApp channel

టాపిక్