Man urinates on dalit in Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళితుడి చెవిలో మరో వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు! ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఉత్తర్ ప్రదేశ్ సోన్భాద్ర జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో ఈ నెల 11న జరిగింది ఈ ఘటన. బాధితుడు, నిందితుడు స్నేహితులని తెలుస్తోంది. కాగా.. వారిద్దరు మద్యం సేవించారని, ఆ తర్వాత ఓ విషయంపై గొడవ మొదలైందని సమాచారం. గొడవ తీవ్రరూపం దాల్చడంతో.. జవహర్ పటేల్ అనే వ్యక్తి, గులాబ్ కోల్ అనే దళితుడిపై దాడి చేశాడు. చివరికి, కిందపడేసి, అతని చెవిలో మూత్ర విసర్జన చేశాడు.
మద్యం మత్తులో నిందితుడు ఈ అమానవీయ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దూరం నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించిన ఓ వ్యక్తి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి వైరల్ అయ్యాయి.
మరోవైపు కొన్ని గంటల తర్వాత.. గులాబ్ కోల్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పటేల్తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
మనుషులపై మూత్ర విసర్జన చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. మధ్యప్రదేశ్లో పరేశ్ శుక్లా అనే వ్యక్తి, ఓ ఆదివాసి సమాజానికి చెందిన వ్యక్తిపై మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బాధితుడి వద్దకు వెళ్లిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అతని కళ్లు కడిగారు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
సంబంధిత కథనం