Surat Murder : ఘోరం.. కన్నకూతురిని 25సార్లు పొడిచి చంపిన తండ్రి.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలు-man stabs daughter 25 times over domestic dispute cctv video surfaces ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Stabs Daughter 25 Times Over Domestic Dispute Cctv Video Surfaces

Surat Murder : ఘోరం.. కన్నకూతురిని 25సార్లు పొడిచి చంపిన తండ్రి.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలు

Chatakonda Krishna Prakash HT Telugu
May 31, 2023 03:43 PM IST

Surat Murder : కూతురిని ఓ వ్యక్తి కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. కుటుంబంలో మొదలైన చిన్న గొడవ ఏకంగా హత్యకు దారితీసింది.

Surat Murder : ఘోరం.. కన్నకూతురిని 25సార్లు పొడిచి చంపిన తండ్రి.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలు (Photo: Twitter)
Surat Murder : ఘోరం.. కన్నకూతురిని 25సార్లు పొడిచి చంపిన తండ్రి.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలు (Photo: Twitter)

Surat Murder : గుజరాత్‍లోని సూరత్‍లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కన్నకూతురిని దారుణంగా చంపాడు. సుమారు 25సార్లు పొడిచి హత్య చేశాడు. భార్యను కూడా గాయపరిచాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‍లో రికార్డ్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

మే 18వ తేదీన సూరత్‍లోని కండోదర ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణ జరుగుతుండగా.. సీసీ టీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో ఇది వైరల్‍గా మారింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని రామానుజగా పోలీసులు గుర్తించారు.

సూరత్‍లోని సత్యనగర్ సొసైటీలో రామానుజ కుటుంబం ఉంటోంది. అయితే, చిన్న గొడవ కారణంగా మే 18న కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్రమైన ఘర్షణగా మారింది. కూతురిని చాలాసార్లు పొడిచి చంపాడు రామానుజ.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. రాత్రి 11.20 గంటలకు ఈ ఘటన జరిగినట్టు అందులో తెలుస్తోంది. ముందుగా తన భార్యపై రామానుజ కత్తితో దాడి చేశాడు. అప్పుడు పిల్లలు అక్కడే ఉన్నారు. అతడిని అడ్డుకునేందుకు పిల్లలు ప్రయత్నించారు. ఈ క్రమంలో కూతురు దొరకడంతో ఆమెను కత్తితో పలుమార్లు పొడిచాడు రామానుజ. తీవ్రగాయాలు అయిన ఆమె చనిపోయింది.

ఇక కూతురుని చంపాక భార్యపై దాడి చేసేందుకు టెర్రస్ వరకు వెంటాడు రామానుజ. అయితే, ఆయన పిల్లలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారికి కూడా గాయలయ్యాయి.

సూరత్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్య, హత్యాయత్నం కేసులను నమోదు చేశారు. కూతురు టెర్రస్‍పై నిద్రించే విషయంపై భార్యతో రామానుజ గొడవ పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఇదే చివరికి పెద్ద గొడవగా మారి హత్యకు దారి తీసిందని తెలుస్తోంది.

కాగా, ఆదివారం ఢిల్లీలోని షాహ్‍బాద్ డెయిరీ ప్రాంతంలో ఓ దారుణ హత్య జరిగింది. 16ఏళ్ల అమ్మాయిని ఆమె బాయ్ ఫ్రెండ్ అత్యంత కిరాతకంగా నడివీధిలో హత్య చేశాడు. కత్తితో పలుమార్లు పొడిచి, బండరాయితో కొట్టి చంపాడు. ఆ అమ్మాయి తనతో మాట్లాడడం లేదని, బ్రేకప్ చెప్పిందనే కోపంతో సాహిల్ అనే 20 ఏళ్ల యువకుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పరారైన అతడిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. తాను ఈ విషయంపై బాధపడడం లేదని, ఆ అమ్మాయి తనను పట్టించుకోనందుకే ఇలా చేశానని పోలీసుల విచారణలో సాహిల్ చెప్పాడని తెలుస్తోంది.

IPL_Entry_Point