మద్యం మత్తులో లివ్ ఇన్ పార్టనర్ ను కత్తితో పొడిచి చంపిన యువతి-man stabbed in scuffle with live in partner months before their wedding dies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మద్యం మత్తులో లివ్ ఇన్ పార్టనర్ ను కత్తితో పొడిచి చంపిన యువతి

మద్యం మత్తులో లివ్ ఇన్ పార్టనర్ ను కత్తితో పొడిచి చంపిన యువతి

Sudarshan V HT Telugu

లివ్ ఇన్ పార్ట్నర్ తో గొడవ పడి, అతడిని ఒక యువతి కత్తితో పొడిచి చంపిన ఘటనడెహ్రాడూన్ లో చోటు చేసుకుంది. అజయ్ రావత్, రాధికా సింగ్ లు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. మద్యం మత్తులో రాధిక తన పార్ట్ నర్ అజయ్ ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.

లివ్ ఇన్ పార్ట్ నర్ హత్య

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో సహ జీవనం చేస్తున్న యువతితో గొడవలో 27 ఏళ్ల యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. అజయ్ రావత్, రాధికా సింగ్ లు డెహ్రాడూన్ లోని నెహ్రూ గ్రామ్ లో కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి కుటుంబాలు కూడా ఈ పెళ్లికి అంగీకారం తెలిపాయి. జూన్ 7న నిశ్చితార్థం, అక్టోబర్ 2న వివాహం జరగాల్సి ఉందని మృతుడు అజయ్ రావత్ తండ్రి దేవేంద్ర ప్రతాప్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కత్తితో పొడిచి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన రోజు సాయంత్రం 4 గంటల సమయంలో అజయ్ రావత్, రాధికా సింగ్ ల మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రమై భౌతికదాడులకు దిగే స్థాయికి చేరింది. కోపంలో రాధిక సింగ్ కిచెన్ లోని కూరగాయల కత్తిని తీసుకువచ్చి, అజయ్ పై దాడి చేసింది. అజయ్ ఛాతి భాగంలో కత్తితో పొడిచింది. దాంతో, తీవ్రంగా రక్తస్రావం అవుతూ, అజయ్ కుప్పకూలిపోయాడు.

మద్యం మత్తులో..

తమ మధ్య గొడవ జరిగిన సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని రాధిక పోలీసులకు తెలిపింది. కత్తితో ఛాతిలో పొడిచిన తరువాత, వెంటనే, ఇరుగుపొరుగువారిని పిలిచి, అతడిని వెంటనే డెహ్రాడూన్ కరోనేషన్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. చికిత్స పొందుతూ అజయ్ చనిపోయాడు. రాధికపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 (ఉద్దేశపూర్వక హత్య) కింద మే 4 న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రాయ్పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ప్రదీప్ నేగి తెలిపారు. రాధికా సింగ్ ను ప్రధాన నిందితురాలిగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.