Crime news : బెంగళూరు నడిరోడ్డు మీద అమానుషం! ఆ 'అనుమానం'తో భార్య గొంతు కోసి చంపిన భర్త-man slits wifes throat on bengaluru street over infidelity issues ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : బెంగళూరు నడిరోడ్డు మీద అమానుషం! ఆ 'అనుమానం'తో భార్య గొంతు కోసి చంపిన భర్త

Crime news : బెంగళూరు నడిరోడ్డు మీద అమానుషం! ఆ 'అనుమానం'తో భార్య గొంతు కోసి చంపిన భర్త

Sharath Chitturi HT Telugu

Bengaluru Crime news : బెంగళూరు ఎలక్ట్రానిక్​ సిటీలో నడిరోడ్డు మీద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం అనుమానాలతో ఆ మహిళ భర్తే, ఆమెను గొంతుకోసి చంపేశాడు.

నడిరోడ్డు మీద భార్యను చంపిన భర్త..

బెంగళూరు నడిరోడ్డు మీద అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! అందరు చూస్తుండగానే, ఓ మహిళను- ఆమె భర్త గొంతు కోసి చంపేశాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆ వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడు.

ఇదీ జరిగింది..

బెంగళూరులోని ఎలక్ట్రానిక్​ సిటీ సమీపంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు పేరు కృష్ణప్ప. అతని వయస్సు 43. అతని భార్య కే శారద వయస్సు 35ఏళ్లు. ఆమె బెంగళూరులో డొమెస్టిక్​ వర్కర్​గా పనిచేస్తోంది.

కాగా కృష్ణప్ప బగెపల్లి కూలీ పని చేసుకుంటున్నాడు. కానీ అతనికి తన భార్య మీద అనుమానాలు చాలా ఎక్కువ. ఈ క్రమంలోనే ఆమెను చంపేందుకు బగెపల్లి నుంచి శుక్రవారం బెంగళూరుకు వచ్చాడు. నడ్డిరోడ్డు మీద, ప్రజల మధ్యలో ఆమెను అడ్డుకున్నాడు. ఆమెతో గొడవకు దిగాడు. చివరికి ఆమె గొంతు కోసేశాడు. ఆ మహిళ నేల మీద కుప్పకూలి పోయి, చివరికి ప్రాణాలు కోల్పోయింది.

భార్యను చంపిన అనంతరం కృష్ణప్ప ఘటనాస్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ స్థానికులు అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగింటారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని సమీక్షించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

బెంగళూరు నడిరోడ్డు మీద జరిగిన ఈ ఘటనతో అందరు షాక్​కి గురయ్యారు. నగరంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

అనుమానం పెట్టిన చిచ్చు!

వివాహేతర సంబంధం నేపథ్యంలో అనుమానాలతో ఇటీవలి కాలంలో దేశంలో అనేక నేరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి, తన భార్యను బెడ్​ మీద సుత్తితో దాడి చేసి చంపిన ఘటన నోయిడాలో తాజాగా కలకలం సృష్టించింది.

నిందితుడి పేరు నూర్​ ఉల్​ లాహ్​ హైదర్​. అతని వయస్సు 55ఏళ్లు. కంప్యూటర్​ ఇంజినీర్​ గ్యాడ్యుయేట్​ అతను. అతని భార్య పేరు ఆస్మా ఖాన్​ (42). ఒక ప్రైవేట్​ కంపెనీలో సివిల్​ ఇంజినీర్​గా పనిచేస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు బీటెక్​ స్టూడెంట్ సమద్​​. ఇంకొకరు 12ఏళ్ల ఇనాయా.

నోయిడాలోని సెక్టర్​ 15 ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని నూర్​కి చాలా కాలంగా అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేదని తెలుస్తోంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం గురువారం ఈ గొడవ మరింత ముదిరింది. దంపతులు రాత్రంగా గొడవపడ్డారు. చివరికి, శుక్రవారం మధ్యాహ్నం బెడ్​రూమ్​ డోర్​ని లాక్​ చేసిన నూర్​.. భార్య మీద దాడి చేశాడు. ఆమెపై దిండు పెట్టి, ఊపిరాడనివ్వకుండా చేశాడు. చివరికి, సుత్తి తీసుకుని ఆమె చనిపోయే దాకా తలపై బలంగా కొట్టాడు. ఆ రక్తం బెడ్​ అంతా చిమ్మింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.