Man rapes girl : భార్య ప్రియుడిపై రివేంజ్ కోసం- అతని బిడ్డను రేప్ చేసి, చంపి!
Man rapes girl : పొరుగింటి వ్యక్తితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న ఓ వ్యక్తి.. అతనిపై కోపం పెంచుకున్నాడు. రివేంజ్ తీర్చుకోవాలని భావించి.. ఆ వ్యక్తి కూతురిని రేప్ చేసి, చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
Man rapes girl : మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వ్యక్తితో భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న భర్త.. అతనిపై రివేంజ్ తీర్చుకోవడం కోసం దారుణానికి ఒడిగట్టారు. పొరుగింటి వ్యక్తికి చెందిన ఏడేళ్ల కూతురిపై అత్యాచారం చేసి, చంపేశాడు.
ట్రెండింగ్ వార్తలు
ఇంత దారుణమా..!
31ఏళ్ల రాజేష్ రాజక్.. తన కుటుంబంతో కలిసి సత్నా జిల్లాలోని ఓ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతని భార్యకు.. పొరుగింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కొంత కాలం తర్వాత రాజేష్కు తెలిసింది. పొరుగింటి వ్యక్తిని కలవొద్దు, మాట్లాడవద్దని చాలా సార్లు భార్యకు చెప్పాడు రాజేష్. కానీ ఆమె, అతడిని కలుస్తూనే ఉంది.
Madhya Pradesh crime news : ఈ పరిణామాలతో.. ఆ వ్యక్తిపై కోపం పెంచుకున్నాడు రాజేష్. అతనిపై రివేంజ్ తీర్చుకోవాలని భావించాడు. సమయం చూసుకుని ఈ నెల 17న.. అతని ఏడేళ్ల బిడ్డను అపహరించాడు. సమీపంలోని అడవులకు తీసుకెళ్లి.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారిని దారుణంగా హత్య చేసి, అడవుల్లో వదిలేసి వెళ్లిపోయాడు.
బిడ్డ కనిపించడం లేదంటూ.. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబసభ్యులు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరంగా సాగించారు. ఈ క్రమంలోనే సమీప అడవుల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడెవరు? అనే విషయం తెలుసుకునే క్రమంలో.. రాజేష్పై పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని విచారించగా.. పోలీసుల ఎదుట నిజాన్ని ఒప్పేసుకున్నాడు.
"నా భార్యకు అతనితో సంబంధం ఉంది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. అందుకే రీవేంజ్ తీర్చుకున్నా," అని నిందితుడు పోలీసులకు చెప్పాడు.
నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, 302 కింద రేప్, మర్డర్తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని బాధితు కుటుంబానికి హామీనిచ్చారు.
కన్న కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం..
Man rapes daughter : దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ 36ఏళ్ల వ్యక్తి.. సొంత కూతురిపై 3ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన గురుగ్రామ్లో వెలుగులోకి వచ్చింది.
36ఏళ్ల వ్యక్తి.. తన కుటుంబంతో పాటు న్యూ పాలమ్ విహార్లో నివాసముంటున్నాడు. కాగా.. అతడికి 15ఏళ్ల కూతురు ఉంది. మూడేళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు ఈ కిరాతకుడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో లైంగికంగా వేధిస్తున్నాడు. ఫలితంగా ఆమె మానసిక వేదనకు గురైంది.
అక్టోబర్ 28న.. బాలికపై మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తండ్రి. ఆమె వెళ్లి.. తన స్నేహితుల వద్ద బాధ పడింది. అప్పుడే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
"ఆ స్నేహితురాలు.. తన తల్లితో ఈ విషయం చెప్పింది. అక్కడి నుంచి ఓ ఎన్జీఓకు సమాచారం వెళ్లింది. గత వారం పోలీసుల దృష్టికి ఈ విషయం వచ్చింది. బాలికను ప్రశ్నించాము. తొలుత చాలా భయపడిపోయింది. ఆ తర్వాత జరిగినదంతా చెప్పేసింది," అని బంజేరా పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.
నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
సంబంధిత కథనం