స్నేహితుడి తల్లిపై కన్నేసిన ఓ ఓ యువకుడు ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుమారుడితో కలిసి ఇంటికి వచ్చి.. స్నేహితుడే తల్లిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో 43 ఏళ్ల మహిళపై ఆమె కుమారుడి స్నేహితుడు అత్యాచారం చేశాడు. భోపాల్లోని అవధాపురిలో ఓ యువకుడు తన స్నేహితుడి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా.. ఆమెను చంపేస్తానని బెదిరించాడు. తనను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించారు.
అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే నీ కొడుకును చంపేస్తానని బెదిరించాడు. ఆమె ప్రతిఘటిస్తుంటే.. పదే పదే బెదిరింపులకు పాల్పడ్డాడు. మహిళపై అత్యాచారం చేసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి రోజు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసింది.
అత్యాచార యత్నాన్ని ప్రతిఘటిస్తే కొడుకును చంపేస్తానని బెదిరించాడని, ఆపై అత్యాచారం చేశాడని బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భోపాల్లోని అవధాపురి ప్రాంతంలో జూలై 12న అత్యాచార ఘటన జరిగింది.
అయితే నిందితుడు అత్యాచారానికి గురైన మహిళ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి తన కుమారుడు, నిందితుడు బయటకు వెళ్లి ఇంటికి వచ్చారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి నిందితుడు తన స్నేహితుడితో కలిసి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆమె కుమారుడు మద్యం తాగి ఉన్నాడు. ఆ తర్వాత బాధితురాలిపై కొడుకు స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.