Man kills wife : బెడ్ మీద మలవిసర్జన చేసిందని.. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చంపిన భర్త!
Man kills wife : అనారోగ్యంతో బాధపడుతున్న భార్య.. మంచం మీద మలవిసర్జన చేసిందన్న కారణంతో, ఆమెను చంపేశాడు ఓ వ్యక్తి. యూపీలో జరిగింది ఈ ఘటన.
Man kills wife in Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్లో ఘోరం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్తే.. ఆమెను కడతేర్చాడు! బెడ్ మీద మలవిసర్జన చేసిందన్న కారణంతో.. కోపం తెచ్చుకుని చంపేశాడు!

ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్ సహరణ్పూర్లో ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు సందీప్. అతని వయస్సు 30ఏళ్లు. బాధితురాలి పేరు అల్క. ఆమె వయస్సు 29ఏళ్లు. వీరిద్దరికి 10ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
ఈ దంపతులకు సంతానం లేదు. కాగా.. మహిళ తరచూ అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటుంది. ఈ విషయంపై ఆమెను నిత్యం తిడుతూనే ఉంటాడు సందీప్.
Man kills ill wife : కాగా.. గురువారం రాత్రి.. అనారోగ్యం కారణంగా మంచం మీదే మలవిసర్జన చేసింది అల్క. అంతే! కోపంతో ఊగిపోయిన సందీప్.. ఆమెను చంపేశాడు!
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు అల్క మృతదేహం పక్కనే కూర్చుని ఉన్న సందీప్ కనిపించాడు. అతడిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు.. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మంచం మీద మలవిసర్జన చేసిందన్న కోపంతోనే భార్యను చంపేసినట్టు.. విచారణలో అంగీకరించాడు నిందితుడు.
అప్పు తీర్చమని అడిగినందుకు..!
Delhi crime news : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ మహిళను, ఓ వ్యక్తి కిరాతకంగా చంపి.. ముఖం మీద యాసిడ్ పోసిన ఘటన తాజాగా దిల్లీలో వెలుగులోకి వచ్చింది. చేసిన అప్పును తీర్చమని మహిళ అడగడంతో.. కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి, చివరికి.. ఆమెను చంపేశాడు.
నిందితుడు, బాధితురాలు.. దిల్లీ నిజాముద్దిన్ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్నారు. నిందితుడు మహమ్మద్ జాకిర్.. రైల్వే స్టేషన్లో టెక్నికల్ సూపర్వైజర్. బాధితురాలు ఓ క్లర్క్. కాగా.. 2018-19 మధ్యలో అతనికి, ఆమె రూ. 11లక్షల వరకు అప్పు ఇచ్చింది. వివిధ మార్గాల్లో లోన్ తీసుకుని, ఆ డబ్బులను జాకిర్కు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న జాకిర్.. ఇప్పటివరకు వాటిని తిరిగివ్వలేదు. మహిళపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో.. అప్పు తిరిగివ్వాలని అతడిని పదేపదే అడిగింది. కానీ అతను డబ్బులు చెల్లించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం