Gujarat road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి!
Gujarat road accident : గుజరాత్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9మంది మరణించారు. బస్సు- ఎస్యూవీ ఢీకొట్టుకోవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
Navsari road accident today : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నవ్సారి జిల్లాలోని అహ్మదాబాద్- ముంబై హైవేపై ఓ బస్సు- ఎస్యూవీ ఢీకొన్నాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. 32మంది గాయపడినట్టు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో క్షతగాత్రులను అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రికి తరలించారు.
Gujarat Road accident news today : అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేతన్ జోషి ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో 32మంది గాయపడ్డారు. వీరిలో 17మందిని వాల్సద్లోని ఆసుపత్రికి, మరో 14మందిని నవ్సారిలోని హాస్పిటల్కు తరలించారు. మిగిలిన వారికి సూరత్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు 9 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం వాటిని ఆసుపత్రికి తరలించారు.
ఘటన జరిగిన సమయంలో ఫార్చ్యూనర్ ఎస్యూవీలో 9మంది ఉన్నారు. వీరందరు.. అంక్లేశ్వర్కు చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. మరోవైపు.. ప్రమాదానికు గురైన బస్సు అహ్మదాబాద్ నుంచి వాల్సద్కు వెళ్లాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదనికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే.. ఎస్యూవీ రాంగ్ రూట్లో వస్తున్నట్టు.. తొలుత డివైడర్ను ఢీకొట్టిన అనంతరం బస్సును తాకినట్టు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని సమాచారం.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెల్లడించారు. కాగా రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. గుర్తుపట్టేలని స్థితికి చేరింది. బస్సు ముందు భాగం ధ్వంసమైంది.
సంబంధిత కథనం
టాపిక్