Crime | మరో దారుణం.. 21ఏళ్ల మహిళపై బస్సు డ్రైవర్​ అత్యాచారం-maharastra crime news private bus driver of pune rapes 21 year old woman in his vehicle ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maharastra Crime News, Private Bus Driver Of Pune Rapes 21-year-old Woman In His Vehicle

Crime | మరో దారుణం.. 21ఏళ్ల మహిళపై బస్సు డ్రైవర్​ అత్యాచారం

Sharath Chitturi HT Telugu
Jun 13, 2022 07:47 PM IST

Maharastra crime news : ఆమె ఓ సాధారణ మహిళ. భర్తతో కలిసి కూలీ పని చేసుకుంటూ జీవితం గడుపుతోంది. పని కోసం నగరానికి వచ్చింది. ఆమెపై కన్నేసిన ఓ బస్సు డ్రైవర్​.. సమయం చూసి ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి వదిలేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర పుణెలో జరిగింది.

21ఏళ్ల మహిళపై బస్సు డ్రైవర్​ అత్యాచారం
21ఏళ్ల మహిళపై బస్సు డ్రైవర్​ అత్యాచారం (HT Telugu)

Maharastra crime news : మహారాష్ట్రలోని పుణె దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆశ్రయిమిస్తానని చెప్పి ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ బస్సు డ్రైవర్​. ఆమె భర్త.. టాయిలెట్​కు వెళ్లిన సమయంలో బస్సును నిర్మానుష్య ప్రాంతానికి తరలించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

భర్త లేని సమయం చూసి..

మహారాష్ట్ర ఖమ్​గావ్​కు చెందిన 21ఏళ్ల మహిళకు ఓ వ్యక్తితో ఏడాది క్రితం పెళ్లి జరిగింది. వారిద్దరు.. చిన్నచిన్న పనులు చేస్తూ జీవితం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పని కోసం కొన్ని రోజుల క్రితం పుణెకు వచ్చారు. అక్కడ.. పలు ప్రాంతాల్లో కూలీ పనులు చేయడం మొదలుపెట్టారు.

కాగా.. జూన్​ 11న.. ఆ దంపతులు రెండు హోటళ్లల్లో పనిచేశారు. చీకటి పడటంతో వసతి కోసం వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వారు స్వర్గేట్​ బస్​ డిపో వద్దకు చేరుకున్నారు. అక్కడే నవ్​నాథ్​ శివాజి భోంగ్​(38) అనే వ్యక్తి.. తన బస్సును నిలిపి ఉంచాడు. కొద్దిసేపటి తర్వాత ఆ దంపతులను అతను గమనించాడు. వారి దగ్గరికి వెళ్లి మాట్లాడటం మొదలుపెట్టాడు. వారికి వసతి కావాలని అతనికి అర్థమైంది. కానీ ఆ మహిళపై అతని కళ్లు పడ్డాయి.

తన బస్సులో పడుకోవాలని వారికి సూచించాడు భోంగ్​. చివరికి ఆ టెంపో ట్రావెలర్​ బస్సులో పడుకునేందుకు ఆ దంపతులు అంగీకరించారు.

తెల్లవారుజామున.. 3:30గంటల సమయంలో మహిళ భర్త నిద్రలేచాడు. టాయిలెట్​కు వెళ్లాలని భోంగ్​కు చెప్పాడు. ఇదే అవకాశంగా భావించిన భోంగ్​.. సమీపంలోని పబ్లిక్​ టాయిలెట్​కు అతడిని తీసుకెళ్లాడు. అతను లోపలికి వెళ్లగానే.. బస్సువైపు పరుగులు తీశాడు.

బస్సును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే.. ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటిస్తే చంపేస్తానని బెదిరించి.. రెండుసార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత.. ఆ మహిళను బస్సు నుంచి బయటపడేసి, అక్కడి నుంచి పారిపోయాడు.

ఘటనను తన భర్తకు వివరించింది ఆ బాధితురాలు. ఇద్దరు కలిసి పోలీస్​ స్టేషన్​కు వెళ్లి.. నిందితుడిపై ఫిర్యాదు చేశారు.

స్వర్గేట్​ బస్​ స్టేషన్​ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్​లను పోలీసులు పరిశీలించారు. నిందితుడి బస్సును గుర్తించారు. కాట్రాజ్​ ప్రాంతంవైపు బస్సు వెళుతోందని గమనించారు. పోలీస్​ పాట్రోల్​ టీమ్​కు సమాచారం ఇచ్చారు. ఆ టీమ్​.. ఆ ప్రైవేటు బస్సు డ్రైవర్​ను వెంబడించింది. అది గ్రహించిన నిందితుడు.. అక్కడి నుంచి పారిపోయేందుకు బండి వేగాన్ని పెంచాడు. కానీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి రెండు గంటల్లోనే పోలీసులకు చిక్కాడు.

విచారణలో భాగంగా.. చేసిన నేరాన్ని నిందితుడు భోంగ్​ ఒప్పుకున్నాడు. భోంగ్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్