Maharashtra politics : నెల ముందే షిండేకు 'సీఎం' ఆఫర్​ ఇచ్చిన ఉద్ధవ్​..?-maharashtra politics rebel mlas takes the fight upto supreme court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maharashtra Politics, Rebel Mlas Takes The Fight Upto Supreme Court

Maharashtra politics : నెల ముందే షిండేకు 'సీఎం' ఆఫర్​ ఇచ్చిన ఉద్ధవ్​..?

Sharath Chitturi HT Telugu
Jun 26, 2022 10:05 PM IST

Maharashtra politics : నెల రోజుల ముందే.. షిండేకు సీఎం పదవిని ఠాక్రే ఆఫర్​ చేశారని ఆదిత్య ఠాక్రే అన్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

నెల ముందే షిండేకు 'సీఎం' ఆఫర్​ ఇచ్చిన ఉద్ధవ్​..?
నెల ముందే షిండేకు 'సీఎం' ఆఫర్​ ఇచ్చిన ఉద్ధవ్​..? (HT PHOTO)

Maharashtra politics : మహారాష్ట్రలో శివసేన- రెబల్స్​ మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న తరుణంలో.. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేనపై తిరుగుబాటు వ్యూహాలు రచించిన కీలక నేత ఏక్​నాథ్​ షిండేకు.. ఉద్ధవ్​ ఠాక్రే నెల రోజుల క్రితమే సీఎం పదవిని ఆఫర్​ చేశారని అన్నారు. ఆ సమయంలో ఏక్​నాథ్​ షిండే కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. కానీ నెల రోజుల తర్వాత అంతా మారిపోయిందని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

ముంబైలో.. శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆదివారం ప్రసంగించారు ఆదిత్య ఠాక్రే.

"మే 20న.. ఏక్​నాథ్​కు ఉద్ధవ్​ ఠాక్రే ఫోన్​ చేశారు. సీఎం కావాలని అనుకుంటే.. ఆ పదవి ఇస్తానని షిండేకు ఉద్ధవ్​ చెప్పారు. ఆ సమయంలో.. ఆయన (షిండే) పెద్ద డ్రామానే చేశారు. ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నెల రోజుల తర్వాత.. ఆయన రెబెల్​గా మారారు. కానీ వాళ్లు(షిండే వర్గం) ఏం చేయలేరు. ఇది తిరుగుబాటు కాదు.. వేర్పాటువాదం. సీఎం అనారోగ్యంగా ఉన్న సమయంలో సరైన అవకాశం లభించిందని పావులు కదిపారు," అని ఆదిత్య ఠాక్రే చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేలందరూ రెబల్స్​గా మారిపోయినా.. ఎప్పటికైనా గెలిచేది పార్టీనే అని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. రెబల్స్​కు రాష్ట్రంలోకి, పార్టీలోకి ప్రవేశించేందుకు తలుపులు మూసుకుపోయాయని తేల్చిచెప్పారు.

Aditya Thackeray : అస్సాంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు.. తాము కిడ్నాప్​కు గురైనట్టు భావిస్తున్నారని ఆదిత్య పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు.

"ఆ పార్టీపై సిగ్గుగా ఉంది. కేంద్రం, అస్సాంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. మరో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను తన వద్దకు పిలిపించుకుని సేవలు చేస్తోంది. అది కూడా.. ఆ రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో!," అని ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.

సుప్రీంకోర్టుకు 'మహా' రాజకీయాలు..

మరోవైపు మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. తనతో పాటు 15మంది ఎమ్మెల్యేలపై మహా వికాస్​ ఆఘాడీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటును వ్యతిరేకిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్​ వేశారు ఏక్​నాథ్​ షిండే. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

Supreme court Maharashtra government : శివసేన శాసనసభా పక్ష నేతగా అజయ్​ చౌదరీని నియమించడంపైనా సుప్రీంకోర్టులో సవాలు చేశారు షిండే. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్​ నరహరి జిర్వాల్​పై వేసిన అవిశ్వాస తీర్మానాన్ని కొట్టివేయడాన్ని కూడా పిటిషన్​లో ప్రస్తావించారు. అవిశ్వాస తీర్మానం సంగతి తేలేంత వరకు.. అనర్హత వేటుపై డిప్యూటీ స్పీకర్​ ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు షిండే.

ఇదీ జరిగింది..

Eknath Shinde latest news : మహా వికాస్​ ఆఘాడీ ప్రభుత్వంలో.. శివసేనది కీలక పాత్ర. కాగా.. ఎన్​సీపీ-కాంగ్రెస్​తో శివసేన చేతులు కలపడం.. ఆ పార్టీలో కొందరికి ఇష్టం లేదు. ఈ క్రమంలోనే శివసేనపై ఆ పార్టీ కీలక నేత ఏక్​నాథ్​ షిండేకు అసంతృప్తి పెరిగిపోయింది. కొన్ని రోజుల క్రితం ఆయన అనూహ్యంగా మాయమైపోయారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు గుజరాత్​ సూరత్​లో దర్శనమిచ్చారు. అక్కడి నుంచి అందరు కలిసి గౌహతీకి వెళ్లారు.

రెబల్స్​ బృందానికి 'శివసేన బాలాసాహెబ్​' అన్న పేరు పెట్టారు ఏక్​నాథ్​ షిండే. ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు? శివసేన పరిస్థితేంటి? మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వం భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు.. సామాన్యుల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్