Maharashtra politics : రెబల్స్పై ఉద్ధవ్ 'రష్మి' అస్త్రం.. వ్యూహం ఫలించేనా?
Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాల పరిస్థితులను తనవైపు తిప్పుకునేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ‘రష్మి’ అస్త్రాన్ని ప్రయోగించినట్టు కనిపిస్తోంది. ఉద్ధవ్ సతీమణి రష్మి.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో రహస్యంగా చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇవి ఫలించేనా?
Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. తాజాగా.. 15మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్రం వై కేటగిరీ భద్రతను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం గౌహతీలో ఉన్న వారికి.. సీఆర్పీఎఫ్తో కూడిన భద్రత దక్కనుంది.
ట్రెండింగ్ వార్తలు
ఎమ్మెల్యేలు రమేష్ బోర్నరే, మంగేష్ కుదాల్కర్, సంజయ్ శిర్సట్, లతాబాయ్ సోనావానే, ప్రకాశ్ సుర్వె, సదానంద్ సరనవంకర్, యోగేష్ దాడా కదం, ప్రతాప్ సర్నైక్, యామిని జాదవ్, ప్రదీప్ జైశ్వాల్, సంజయ్ రాథోడ్, దాదాజి భూషే, దిలీప్ లండే, బాలాజీ కల్యానర్, సందీపన్ భూమేర్ల భద్రతను సీఆర్పీఎఫ్ దళాలు.. చూసుకోనున్నాయి. శివసేన కీలక నేత, తిరుగుబాటు వ్యూహాన్ని రచించిన ఏక్నాథ్ షిండే పేరు ఈ జాబితాలో లేదు!
ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు మొదలయ్యాయి. సీఆర్పీఎఫ్కు ఆదివారమే కేంద్ర హోంశాఖ నుంచి సంబంధిత లేక అందింది.
ఎమ్మెల్యేలకు ఉండాల్సిన భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని ఏక్నాథ్ షిండే ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం వై కేటగిరీని ఏర్పాటు చేసింది. కాగా.. తాము ఎలాంటి భద్రతను తొలగించలేదని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాల్సే పాటిల్ స్పష్టం చేశారు.
రంగంలోకి ఉద్ధవ్ సతీమణి..
తిరుగుబాటు నేతల వర్గం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఏక్నాథ్ వద్ద 40కిపైగా మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు! ఏక్నాథ్ తలచుకుంటే.. పార్టీని చీల్చేయవచ్చు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాలు కూడా ఏం చేయలేవు. ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను మరింత వేధించే విషయం. శివసేన- రెబల్స్ ప్రతిష్ఠంభన మధ్య.. ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మి వార్తల్లో నిలిచారు.
Uddhav Thackery : రష్మి.. తెరవెనుక రాజకీయాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో ఉద్ధవ్ సతీమణి రహస్య చర్చలు జరుపుతున్నట్టు.. భర్తలను వెనక్కి తిరిగివచ్చే విధంగా మాట్లాడాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది స్పష్టత లేదు.
రెబల్స్ శాంతించారా?
గౌహతీలో ఉంటున్న శివసేన రెబల్స్లోని 20మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ ఠాక్రేతో 'టచ్'లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరిని తనవైపు తిప్పుకుంటే శివసేన.. పరిస్థితులను చక్కదిద్దిన్నట్టే!
కాగా.. రెబల్స్ బృందంలో మనస్పర్థలు పెరుగుతున్నట్టు సమాచారం. బీజేపీలో చేరాలని కొందరు భావిస్తుంటే.. ఆ ఆలోచనను మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
'రాజీనామా చేయండి..'
ఈ క్రమంలో.. మహారాష్ట్ర మంత్రి, ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే.. రెబల్స్కు సవాలు విసిరారు. తన తండ్రి చేసింది తప్పు అని అనిపిస్తే.. వెంటనే రాజీనామా చేయాలని తేల్చిచెప్పారు. తాము ఎన్నికలకు సిద్ధమని స్పష్టం చేశారు.
"మీకు ధైర్యం ఉంటే శివసేనను విడిచిపెట్టి వెళ్లిపోండి. ఒంటరిగా పోరాడండి. మేము చేసింది, ఉద్ధవ్ ఠాక్రే చేసింది తప్పు అని మీకు అనిపిస్తే.. రాజీనామా చేయండి. ఎలక్షన్ను ఎదుర్కోండి. ఎన్నికలకు మేము సిద్ధమే," అని ఆదిత్య ఠాక్రే అన్నారు.
ఇదీ జరిగింది..
Eknath Shinde latest news : మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో.. శివసేనది కీలక పాత్ర. కాగా.. ఎన్సీపీ-కాంగ్రెస్తో శివసేన చేతులు కలపడం.. ఆ పార్టీలో కొందరికి ఇష్టం లేదు. ఈ క్రమంలోనే శివసేనపై ఆ పార్టీ కీలక నేత ఏక్నాథ్ షిండేకు అసంతృప్తి పెరిగిపోయింది. కొన్ని రోజుల క్రితం ఆయన అనూహ్యంగా మాయమైపోయారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు గుజరాత్ సూరత్లో దర్శనమిచ్చారు. అక్కడి నుంచి అందరు కలిసి గౌహతీకి వెళ్లారు.
రెబల్స్ బృందానికి 'శివసేన బాలాసాహెబ్' అన్న పేరు పెట్టారు ఏక్నాథ్ షిండే. ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు? శివసేన పరిస్థితేంటి? మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు.. సామాన్యుల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్