మహా కుంభమేళా 2025: 45 రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల ఆదాయం అంచనా.. యూపీ ఆర్థిక వ్యవస్థకు ఊతం-maha kumbha mela 2025 up likely to earn rs 2 lakh crore revenue in 45 days here is how ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మహా కుంభమేళా 2025: 45 రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల ఆదాయం అంచనా.. యూపీ ఆర్థిక వ్యవస్థకు ఊతం

మహా కుంభమేళా 2025: 45 రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల ఆదాయం అంచనా.. యూపీ ఆర్థిక వ్యవస్థకు ఊతం

HT Telugu Desk HT Telugu
Jan 13, 2025 02:06 PM IST

మహా కుంభమేళా 2025 5 మిలియన్లకు పైగా భక్తులతో ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. ఈ గొప్ప ఆధ్యాత్మిక ఘట్టానికి 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమం స్థానిక ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచనుంది. 45 రోజులలో పర్యాటకం, వసతి ద్వారా రూ. 2 లక్షల కోట్లు ఆర్జించే అవకాశం ఉంది.

మహా కుంభమేళా 2025కు హాజరైన భక్తులు
మహా కుంభమేళా 2025కు హాజరైన భక్తులు (Kamal Kishore)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఉదయం ప్రారంభమైన మహా కుంభమేళా 2025లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద 5 మిలియన్లకు పైగా భక్తులు తమ మొదటి పవిత్ర స్నానం చేశారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా పేరున్న ఈ సంప్రదాయ కార్యక్రమం అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువగా 40 కోట్ల మందిని ప్రయాగ్‌రాజ్‌కు ఆకర్షిస్తుందని అంచనా.

మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం ఇది దాదాపు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

మహా కుంభమేళా 2025 యూపీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందా?

మహా కుంభమేళా 2025 ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిచ్చే అవకాశం ఉంది. ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ (CAIT) ప్రకారం, 45 రోజుల మెగా ఈవెంట్ కోసం రాష్ట్రం రూ. 2 లక్షల కోట్లకు పైగా ఆర్జించే అవకాశం ఉంది. 40 కోట్ల మంది సందర్శకులలో ప్రతి ఒక్కరూ సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే, మొత్తం వ్యయం ఈ సంఖ్యను చేరుకుంటుంది.

వసతి, పర్యాటకం ఈ ఆర్థిక వృద్ధికి అతిపెద్ద సహకారం అందించే అవకాశం ఉందని, స్థానిక హోటళ్ళు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక వసతి ఏర్పాట్ల ద్వారా రూ. 40,000 కోట్లు రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉందని CAIT తెలిపింది.

రెవెన్యూ తెచ్చే పెట్టేవి ఇంకా

"మహా కుంభమేళాలో పెద్ద ఎత్తున ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయి. ఒక అంచనా ప్రకారం, మతపరమైన ఈ ప్రయాణంలో ప్రతి వ్యక్తి సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే, మొత్తం ఖర్చు రూ. 2 లక్షల కోట్లు దాటుతుంది. ఇందులో హోటళ్ళు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక వసతి, ఆహారం, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలపై ఖర్చులు ఉంటాయి" అని CAIT ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.

ప్యాక్ చేసిన ఆహారాలు, నీరు, బిస్కెట్లు, జ్యూస్‌లు, భోజనంతో సహా ఆహార, పానీయ రంగం మొత్తం వాణిజ్యానికి రూ. 20,000 కోట్లు తెచ్చిపెడుతుందని అంచనా.

నూనె, దీపాలు, గంగాజలం, విగ్రహాలు, ధూపం, మతపరమైన పుస్తకాలు, వస్తువులు, నైవేద్యాలు మరొక ప్రధాన ఆర్థిక కార్యకలాప రంగం. ఇది దాదాపు రూ. 20,000 కోట్ల రెవెన్యూ తెచ్చిపెడుతుందని అంచనా.

అదనంగా, స్థానిక, రాష్ట్రాంతర సేవలు, సరుకు రవాణా, టాక్సీలతో సహా రవాణా, లాజిస్టిక్స్ రెవెన్యూ రూ. 10,000 కోట్లు ఉంటుందని అంచనా.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.