యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న మహా కుంభమేళా ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళా నేడు, సోమవారం ప్రారంభంకానుంది. ఇందుకోసం యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మరీ ముఖ్యంగా మహా కుంభమేళాకు హాజరయ్యే 45 కోట్ల మంది ప్రజల భద్రత కోసం ప్రయాగ్రాజ్ పోలీసులు కనీవినీ ఎరుగని విధంగా చర్యలు చేపట్టారు.
ప్రతి 12ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాలో జరిగే కార్యక్రమాల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
జిల్లాను పొరుగు ప్రాంతాలతో కలిపే ప్రధాన మార్గాలతో పాటు ప్రయాగ్రాజ్ చుట్టూ పటిష్టమైన భద్రతా ఫ్రేమ్వర్క్ కోసం ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
సంబంధిత కథనం