Madya Pradesh road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది దుర్మరణం
Madya Pradesh road accident : మధ్యప్రదేశ్లో ఓ కారు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు.
Madya Pradesh road accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెతుల్ జిల్లాలో ఓ బస్సును, ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11మంది మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు
కూలీలు ఇంటికి వెళుతుండగా..
పోలీసుల సమాచారం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులందరు స్థానికులు. మహారాష్ట్ర అమరావతిలో కూలీలుగా పనిచేసే వీరు.. బెతుల్లోని సొంత గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
"మహారాష్ట్ర అమరావతి నుంచి చిక్లర్, మహద్గావ్, ఝాల్లర్ గ్రామాలకు చెందిన కూలీలు.. ఇళ్లకు తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎస్యూవీ వెళ్లి బస్సును ఢీకొట్టింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 7 మృతదేహాలను వెలికి తీశారు. కానీ మరో నాలుగు మృతదేహాలను.. వాహనాలను కోస్తే తప్ప తీయలేకపోయారు," అని బెతుల్ ఎస్పీ తెలిపారు.
పోస్టుమార్టం అనంతరం.. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించారు అధికారులు. ఈ ఘటనలో గాయపడిన ఓ వ్యక్తిని.. ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రమాదం కారణంగా కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సు ముందు భాగంలో అద్దాలు పగిలిపోయాయి.
మధ్యప్రదేశ్లో ప్రమాదాలు..
మధ్యప్రదేశ్లో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే 3 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మొరేనా నుంచి వస్తున్న ఓ కారును ట్రక్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యూపీ నుంచి మధ్యప్రదేశ్కు వస్తున్న వాహనానికి ప్రమాదం జరిగి 15మంది మరణించారు. ఇక తాజా ఘటనలో 11మంది మృతిచెందారు.
సంబంధిత కథనం
టాపిక్