Madhya Pradesh road accident : రెండు బస్సులను ఢీకొట్టిన ట్రక్కు.. 8మంది బలి
Madhya Pradesh road accident : మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8మంది మరణించారు. 50మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.
Madhya Pradesh road accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ.. సిద్ధి ప్రాంతంలో ఓ ట్రక్కు.. మరో రెండు బస్సులను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సుల్లోని ప్రజలు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ర్యాలీ నుంచి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ట్రెండింగ్ వార్తలు
పార్కు చేసి ఉన్న బస్సులను ఢీకొట్టి..
మధ్యప్రదేశ్ బఘాడా గ్రామానికి సమీపంలో జరిగింది ఈ ఘటన. వేగంగా వెళుతున్న ట్రక్కు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో, అదుపు తప్పి రెండు బస్సులను బలంగా ఢీకొట్టిందని తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Madhya Pradesh Sidhi road accident : "రెండు బస్సులు పార్కు చేసి ఉన్నాయి. అందులో అనేకమంది ప్రజలు ఉన్నారు. కాగా.. ఓ ట్రక్కు టైర్ పగిలి ఆ రెండు బస్సులవైపు దూసుకెళ్లింది. వాటిని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో 50మంది గాయపడ్డారు. వీరిలో 15-20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టాము. మరింత సమాచారం తెలియాల్సి ఉంది," అని రేవా ఎస్పీ ముఖేశ్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు.
Sidhi road accident death toll : ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షలు, స్వల్పంగా గాయపడిన వారిక రూ. 1లక్ష పరిహారాన్ని ప్రకటించారు.
ప్రమాదంపై అమిత్ షా స్పందించారు.
MP road accident latest news : "సిద్ధిలో జరిగిన రోడు ప్రమాదం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలని నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్టకాలంలో దేవుడు వారికి అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వారు వేగంగా కోలుకోవాలి," అని ట్వీట్ చేశారు అమిత్ షా.