petrol diesel price hike : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. ప్రజలపై కొత్త ‘సెస్’ భారం!
Petrol diesel price hike in Kerala : పెట్రోల్, డీజిల్పై రూ. 2 పెంచింది కేరళ ప్రభుత్వం. కొత్త సెస్ను ప్రవేశపెట్టింది.
Petrol diesel price hike in Kerala : రాష్ట్ర ప్రజలపై కేరళ ప్రభుత్వం కొత్త 'సెస్' భారాన్ని మోపింది. పెట్రోల్, డీజిల్పై సోషల్ సెక్యూరిటీ సెస్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
సోషల్ సెక్యూరిటీ సెస్తో కేరళలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 2 పెరిగాయి. తాజా నిర్ణయంతో.. సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్ నిర్వహిస్తున్న ప్రభుత్వానికి అదనంగా రూ. 750కోట్ల ఆదాయం లభించనుంది! ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా.. కేరళలో ఏడాదిగా ధరలు పెరగడం ఇదే తొలిసారి.
Petrol Diesel price in Kerala : కేరళలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 105.81గా ఉంది. దేశంలో పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కేరళ ఒకటి. ఇక లీటరు డీజిల్ ధర రూ. 94.74గా ఉంది.
కేరళ బడ్జెట్ 2023లో భాగంగా.. దేశీయంగా తయారు చేసిన విదేశీ లిక్కర్పైనా కొత్త సెస్ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఫలితంగా మద్యం ధరలు కూడా పెరిగాయి. ఈ పెంచిన ధరలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.
పెట్రోల్.. డీజిల్..
Kerala Budget 2023 : కొవిడ్ అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇక రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరి, అక్కడి నుంచి వెనుదిరిగాయి. దేశంలో మాత్రం గతేడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. చమురు ధరలు భారీగా పెరిగినా.. ఇండియాలో వాటిని పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. త్వరలోనే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు దిగొస్తాయని, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవలే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కొత్త సెస్తో ప్రజలపై కేరళ ప్రభుత్వం అధిక భారాన్ని మోపుతుండటం గమనార్హం.
ఓవైపు పెట్రోల్, డీజిల్పై కొత్త సెస్ను విధించి ధరలను పెంచిన కేరళ ప్రభుత్వం.. ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ను పెంపొందించే విధంగా చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ మోటార్ క్యాబ్స్, ఎలక్ట్రిక్ టూరిస్ట్ మోటార్ క్యాబ్స్పై వేసే వన్ టైమ్ ట్యాక్స్ను.. కొనుగోలు ధరలో 5శాతానికి తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బడ్జెట్ 2023లో కీలక ప్రతిపాదన చేసింది కేరళ ప్రభుత్వం.
Petrol price increased in Kerala : కేరళ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023పై విపక్షాలు మండిపడ్డాయి. ప్రజలపై భారాన్ని వేస్తున్న ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి.