Lightning strikes: రెండు రోజుల్లో పిడుగుపాటుకు 60 మంది మృతి; ఒక్క రోజులో 75 వేల పిడుగులు-lightning strikes kill at least 60 in bihar up officials ask people to take precautions while raining ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lightning Strikes: రెండు రోజుల్లో పిడుగుపాటుకు 60 మంది మృతి; ఒక్క రోజులో 75 వేల పిడుగులు

Lightning strikes: రెండు రోజుల్లో పిడుగుపాటుకు 60 మంది మృతి; ఒక్క రోజులో 75 వేల పిడుగులు

HT Telugu Desk HT Telugu

బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలో బుధ,గురు వారాల్లో పిడుగులు పడి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే 43 మంది చనిపోయారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెండు రాష్ట్రాల అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఒక్క రోజులో 75 వేల పిడుగులు

Lightning strikes: ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 60 మంది మృతి చెందినట్లు రాష్ట్ర సహాయ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. బుధ, గురువారాల్లో ఉత్తరప్రదేశ్ లోని 10 జిల్లాల్లో 43 మంది, బిహార్ లోని పలు జిల్లాల్లో పిడుగుపాటుకు 20 మంది చనిపోయారు. రెండు రాష్ట్రాల్లో 40 మందికి పైగా గాయపడ్డారు. వర్షాకాలంలో ఇలాంటి పిడుగులు పడటం అసాధారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, వర్షాకాలానికి ముందు, వర్షాకాలం ముగిసిన తరువాత వర్షాలు కురిసే సమయంలో పిడుగులు (Lightning strikes) పడడం సర్వసాధారణమని వివరిస్తున్నారు.

అసాధారణ పిడుగులకు కారణం

‘‘ఈ ప్రాంతాలు ఇంతకు ముందు పొడిగా, వేడిగా ఉండేవి. రుతుపవనాల ద్రోణి ఉత్తరం వైపుకు మారడం ప్రారంభించినప్పుడు, తేమ చొరబాటు వల్ల అకస్మాత్తుగా చాలా ఉష్ణమండల మేఘాలు అభివృద్ధి చెందాయి. దానివల్ల పెద్ద సంఖ్యలో పిడుగులు పడుతున్నాయి’’ అని స్కైమెట్ (SKYMET) వాతావరణ విభాగం వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ చెప్పారు. అయితే, వర్షాకాలంలో ఇది చాలా అసాధారణమని, వర్షాకాలానికి ముందు నెలల్లో లేదా రుతుపవనాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో ఇలాంటి భారీ స్థాయిలో పిడుగులు పడటం మనం చూస్తుంటామని ఆయన వివరించారు.

రుతుపవనాల ద్రోణి కారణంగా..

వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల వేడి గాలి వ్యాకోచం చెందడం కూడా ఈ పిడుగులకు కారణమని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడ్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ముందుగానే అంచనా వేసిందని లైట్నింగ్ రెసిస్టెంట్ క్యాంపెయిన్ ఇండియా కన్వీనర్ కల్నల్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. మధ్య, ఈశాన్య భారతంపై విద్యుదీకరణ చెందిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ గురువారం మధ్యాహ్నం హెచ్చరించింది.

ఒక్క రోజులో 75 వేల పిడుగులు

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) డేటాను ప్రస్తావిస్తూ, గురువారం భారతదేశంలో సుమారు 75,000 పిడుగుపాటు సంఘటనలు జరిగాయని శ్రీవాస్తవ చెప్పారు. ఐఎండీ క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా గురువారం భారతదేశంలోనే కాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్రం సహా దాని ప్రాంతీయ ప్రాంతాల్లో 2,40,000 పిడుగులు పడ్డాయని అంచనా వేసింది. నైరుతి ద్వీపకల్ప భారతంలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.