కోల్​కతా హోటల్​లో భారీ అగ్నిప్రమాదం- 14మంది దుర్మరణం!-kolkata hotel fire accident kills 14 rescue operation underway ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కోల్​కతా హోటల్​లో భారీ అగ్నిప్రమాదం- 14మంది దుర్మరణం!

కోల్​కతా హోటల్​లో భారీ అగ్నిప్రమాదం- 14మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu

కోల్​కతాలోని ఓ హోటల్​లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14మంది మరణించారు. అనేక మందిని రెస్క్యూ చేశారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

హోటల్​లో అగ్నిప్రమాదం దృశ్యం..

పశ్చిమ్​ బెంగాల్​ రాజధాని కోల్​కతాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్​లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు.

హోటల్​లో అగ్నిప్రమాదం..

కోల్​కతా ఫాల్పట్ట మచ్చువ అనే ప్రాంతంలో ఉన్న రితురాజ్​ అనే హోటల్​లో మంగళవారం రాత్రి 8 గంటల 15 నిమిషాల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది.

కోల్​కతా అగ్నిప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి వెళ్లారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అనేక మందిని రక్షించారు. కానీ ఈ ప్రమాదంలో 14మంది మరణించారు.

కోల్​కతా హోటల్​లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

“మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టాము. ఇందుకోసం ప్రత్యేక టీమ్​ని ఏర్పాటు చేశాము,” అని కోల్​కతా పోలీస్​ కమిషనర్​ మనోజ్​ కుమార్​ తెలిపారు.

కాగా మంటలు ఎగిసిపడిన కొద్ది సేపటికే హోటల్​లోని వారు బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించారు.

“అగ్నిప్రమాదం వల్ల హోటల్​తో పాటు గదుల్లో పొగ పేరుకుపోయింది. హోటల్​ సిబ్బంది మెట్లు ఎక్కి, రూఫ్​ మీదకు వెళ్లిపోయారు. వీరిలో ఒకరు ప్యానిక్​ అయిపోయి, కిందకు దూకేశారు. ఆ వ్యక్తి మరణించాడు,” అని ఓ అధికారి వివరించారు.

ఈ ఘటనపై పశ్చిమ్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఆరా తీశారు. మేయర్​ని ఘటనా స్థలానికి పంపించి, పరిస్థితులను సమీక్షించాలని చెప్పారు.

‘ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి..’

కోల్​కతా హోటల్​లో అగ్నిప్రమాదం ఘటనపై కేంద్రమంత్రి, బెంగాల్​ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందార్​ స్పందించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇలాంటి విషాదకర సంఘటనలు మళ్లీ జరగకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని, కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

“కోల్​కతా అగ్నిప్రమాదంలో బాధితుల కోసం వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. బాధితులకు అవసరమైన వైద్య సాయం అందించాలి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి,” అని ఎక్స్​లో ఒక పోస్ట్​ పెట్టారు సుకంత.

ఈ ఘటనపై పశ్చిమ్​ బెంగాల్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు సుభంకర్​ సైతం స్పందించారు. కోల్​కతా కార్పొరేషన్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

“ఇది విషాదకర ఘటన. అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో చాలా మంది చిక్కుకున్నారు. భద్రత లేదు, రక్షణ లేదు. కార్పొరేషన్​ ఏం చేస్తోందో తెలియడం లేదు,” అని అన్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.