Kerala rape case : యువతిపై 2ఏళ్లుగా అత్యాచారం- 60 మంది అనుమానితుల్లో కోచ్​లు, క్లాస్​మేట్స్​, స్థానికులు!-kerala rape case girl raped over 2 years coaches among over 60 allegedly involved 6 held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kerala Rape Case : యువతిపై 2ఏళ్లుగా అత్యాచారం- 60 మంది అనుమానితుల్లో కోచ్​లు, క్లాస్​మేట్స్​, స్థానికులు!

Kerala rape case : యువతిపై 2ఏళ్లుగా అత్యాచారం- 60 మంది అనుమానితుల్లో కోచ్​లు, క్లాస్​మేట్స్​, స్థానికులు!

Sharath Chitturi HT Telugu
Jan 11, 2025 12:10 PM IST

కేరళలోని ఓ 18ఏళ్ల యువతిపై అనేకమార్లు అత్యాచారం జరిగింది! ఈ ఘటనపై 4 కేసులు నమోదయ్యాయి. కాగా 60మంది అనుమానితుల్లో కోచ్​లు, క్లాస్​మేట్స్​, స్థానికులు ఉన్నారు.

యువతిపై 2ఏళ్లుగా అత్యాచారం..!
యువతిపై 2ఏళ్లుగా అత్యాచారం..! (Pixabay/Representative)

కేరళలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ 18ఏళ్ల యువతి గత రెండేళ్లుగా అత్యాచార ఘటనలు ఎదుర్కొంటూ వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన 60 మంది అనుమానితుల్లో క్లాస్​మేట్స్​, స్థానికులు, కోచ్​లు ఉన్నారు.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

కేరళ పతనంతిట్టలో రెండేళ్ల కాలంలో సదరు యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు ఇప్పటివరకు నాలుగు ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు.

రెండు నెలల క్రితం 18 ఏళ్లు నిండిన సదరు యువతి.. 16 ఏళ్ల వయసు నుంచి పలుమార్లు అత్యాచారానికి గురైంది.

బాధితురాలు ఒక క్రీడాకారిణి అని, కానీ గత కొంత కాలంగా ఆమెలో మార్పులు వచ్చాయని తెలుస్తోంది. ఆ మార్పులను గుర్తించిన ఓ టీచర్​, ఆ విషయాన్ని చైల్డ్​ వెల్​ఫేర్​ కమిటీకి చెప్పారు. ఫలితంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రెండు ఎఫ్​ఐఆర్​లకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశామని, మరో వ్యక్తి ఇప్పటికే వేరే కేసుకు సంబంధించి జైలులో ఉన్నాడని కేరళ పోలీసులు తెలిపారు.

కోచ్​లు, క్లాస్​మేట్స్ ప్రమేయం!

పతనంతిట్ట చైల్డ్ వెల్​ఫేర్ కమిటీ చైర్మన్ రాజీవ్ ఎన్ ప్రకారం.. పాఠశాల కౌన్సెలింగ్ సెషన్​లో టీనేజర్ మొదట తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. ఆ తరువాత కౌన్సిలర్లు చైల్డ్ వెల్​ఫేర్​ కమిటీని సంప్రదించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైంది.

కేరళలోని పతనంతిట్టలో క్రీడా శిబిరాలతో పాటు పలు చోట్ల కోచ్​లు, తోటి విద్యార్థులు, స్థానికులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

బాధితురాలికి పర్సనల్ ఫోన్ లేదని, తన తండ్రి మొబైల్​ను ఉపయోగించి తనను వేధింపులకు గురిచేసిన సుమారు 40 మంది నంబర్లను సేవ్ చేసిందని పోలీసులు తెలిపారు.

ఆరోపణలు నిజమని నిర్ధారించుకునేందుకు చైల్డ్ వెల్​ఫేర్​ కమిటీ సభ్యులు బాధితురాలిని సైకాలజిస్ట్​ వద్దకు కౌన్సిలింగ్​కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ కేసు అసాధారణమైనదిగా గ్రహించిన తర్వాత పోలీసులకు సమాచారం అందించామని చైల్డ్ వెల్​ఫేర్​ కమిటీ ఛైర్మన్ తెలిపారు.

ఈ వ్యవహారంపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోక్సో చట్టంతో పాటు క్రిమినల్ చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.