Beer price Increase: బీర్ ప్రియులకు బ్యాడ్ న్యూస్; మళ్లీ పెరగనున్న ధరలు!-karnataka to increase beer prices again state issues final notification in this regard ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Beer Price Increase: బీర్ ప్రియులకు బ్యాడ్ న్యూస్; మళ్లీ పెరగనున్న ధరలు!

Beer price Increase: బీర్ ప్రియులకు బ్యాడ్ న్యూస్; మళ్లీ పెరగనున్న ధరలు!

Sudarshan V HT Telugu
Jan 10, 2025 06:40 PM IST

Beer price Increase: రాజధాని బెంగళూరు సహా కర్నాటక వ్యాప్తంగా మరోసారి బీరు ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్ కారణంగా కర్ణాటకలో బీర్ల ధరలు 10-20 శాతం పెరగనున్నాయి.

బీర్ ప్రియులకు బ్యాడ్ న్యూస్
బీర్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ (Pexels)

Beer price Increase: ధరల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయడంతో కర్ణాటకలో మరోసారి బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. మెయిన్ స్ట్రీమ్, ప్రీమియం సెగ్మెంట్ల బీర్ల ధర 10 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. ఏడాది వ్యవధిలో కర్నాటకలో బీర్ల ధరలు పెరగడం ఇది మూడో సారి. బీర్ బ్రాండ్ల ధరల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేట్లు 2025 జనవరి 20 నుంచి అమల్లోకి వస్తాయి. ముసాయిదా సవరణలో బీరును మూడు ఉపవర్గాలుగా విభజించి, ప్రతి బీరుపై ఒకే విధమైన ఎక్సైజ్ సుంకాన్ని వర్తింపజేయాలని ప్రతిపాదించారు.

yearly horoscope entry point

ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

అయితే, ఇంకా ఎలాంటి అదనపు నిర్ణయాలు తీసుకోలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ ధృవీకరించారు. కాగా, ఈ ముసాయిదా నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని 2024 అక్టోబర్ లో ప్రముఖ బీర్ తయారీదారులైన యునైటెడ్ బ్రూవరీస్, ఏబీఎన్ బెవ్, కార్ల్స్ బర్గ్ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. ధరల పెంపు వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని, ఇది రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వానికి రాసిన లేఖలో బీఏఐ పేర్కొంది.

ఆదాయం తగ్గుతుంది..

ఎమ్మార్పీ పెరగడం వల్ల, బీర్ల వినియోగం తగ్గి, ఆమేరకు ఆదాయం తగ్గుతుందని బీఏఐ ప్రభుత్వానికి వివరించింది. బీర్ కేటగిరీ నుంచి వచ్చే పన్ను ఆదాయం ఈ ప్రతిపాదన వల్ల రూ.400 కోట్ల వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నామని వెల్లడించింది. అంతేకాదు, రాష్ట్రంలోని 10 బ్రూవరీల్లో రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడులు ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది. అలాగే, భవిష్యత్తులో రాష్ట్రంలో పెట్టుబడులు ప్రశ్నార్థకంగా మారతాయని పేర్కొంది. ‘‘అధిక ధరలు అమ్మకాలను దెబ్బతీస్తాయి. తయారీ కార్యకలాపాలు తగ్గుతాయి. వాణిజ్యం, ఆతిథ్య పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతుంది’’ అని బీఏఐ హెచ్చరించింది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.