Karnataka road accident : ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి-karnataka road accident 7 women killed 11 injured as truck collides with auto ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Karnataka Road Accident, 7 Women Killed, 11 Injured As Truck Collides With Auto

Karnataka road accident : ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 05, 2022 09:22 AM IST

Karnataka road accident : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న ఓ ఆటోను.. ట్రక్​ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం

Karnataka road accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్​లో శుక్రవారం అర్ధరాత్రి.. ఓ ఆటోను ఓ ట్రక్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులందరు మహిళలే. మరో 11మంది గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

శుక్రవారం పని ముగించుకుని, తమ ఇళ్లకు వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కారు ఆ ఏడుగురు మహిళలు. కాగా.. బీమలఖేడ ప్రభుత్వ స్కూల్​ వద్ద.. ఆటోను ట్రక్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారందరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

మృతి చెందిన మహిళలను.. పార్వతి(40), ప్రభావతి(36), గుండమ్మ(60), యాదమ్మ(40), జగ్గమ్మ(34), ఈశ్వరమ్మ(55), రుక్మిణి భాయ్​(60)గా గుర్తించారు అధికారులు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

మధ్యప్రదేశ్​లో..

మధ్యప్రదేశ్​లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నివారీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి.. ఓ కారు, చెట్టును బలంగా ఢీకొట్టింది. ఓ పార్టీ నుంచి తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

Madhya Pradesh road accident news : ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. కాగా.. చెట్టును ఢీకొట్టిన కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలను బయటకు తీసేందుకు దాదాపు 6గంటల సమయం పట్టింది. గ్యాస్​ కట్టర్ల సాయంతో కారును కట్​ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు.

మధ్యప్రదేశ్​లో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదం పెరిగిపోతున్నాయి. . బెతుల్​ జిల్లాలో ఓ బస్సును, ఓ కారు ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.. ఈ ఘటనలో 11మంది మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులందరు స్థానికులు. మహారాష్ట్ర అమరావతిలో కూలీలుగా పనిచేసే వీరు.. బెతుల్​లోని సొంత గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

అంతకముందు.. అక్టోబర్​ చివరి వారంలో.. జరిగిన రోడ్డు ప్రమాదంలో 14మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం