Quota to Muslims: ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం-karnataka cabinet grants 4 percent tender quota to muslim contractors amends ktpp act ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Quota To Muslims: ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

Quota to Muslims: ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

Sudarshan V HT Telugu

Quota to Muslims: ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా, కర్ణాటక గ్రామ స్వరాజ్, పంచాయతీరాజ్ (సవరణ) బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది.

ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు

Quota to Muslims: ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ (కేటీపీపీ) చట్ట సవరణకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన మాదిరిగానే అన్ని అనధికార గ్రామీణ ఆస్తులకు 'బి' ఖాతాలను అందించడానికి ఉద్దేశించిన కర్ణాటక గ్రామ స్వరాజ్ అండ్ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖాతాలు లేని సుమారు 90 లక్షల గ్రామీణ ఆస్తులకు ఈ బిల్లు వర్తిస్తుందని భావిస్తున్నారు.

ఫ్లవర్ ఆక్షన్ బెంగళూరు

అంతర్జాతీయ ఫ్లవర్ ఆక్షన్ బెంగళూరు (ఐఎఫ్ఏబీ) కోసం హెబ్బాళ్ లొ వ్యవసాయ శాఖకు చెందిన 4.24 ఎకరాల భూమిని రెండేళ్ల పాటు అద్దె లేకుండా ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జనవరి అగ్నిప్రమాదం తర్వాత బెంగళూరు బయోఇన్నోవేషన్ సెంటర్లో పునర్నిర్మాణం, పరికరాల భర్తీకి రూ.96.77 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆమోదించడంపై కూడా చర్చలు జరిగాయి.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై కూడా..

కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంస్కరించే చర్యలపై కేబినెట్ చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేపీఎస్సీ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, కేపీఎస్సీ సభ్యులను నియమించేందుకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కొత్త యూనివర్సిటీల మూసివేత?

గత బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త విశ్వవిద్యాలయాల మూసివేయాలా? లేదా కొనసాగించాలా? అనే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం శాసనసభలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల స్థితిగతులను సమీక్షించేందుకు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వథ్ నారాయణ్ వాయిదా తీర్మానం కింద ఈ అంశంపై చర్చించాలని అసెంబ్లీలో కోరినప్పుడు ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.