Karnataka assembly elections : ఈ రాష్ట్రంలో.. 95శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే!
Karnataka assembly elections : ఏడీఆర్ నివేదిక ప్రకారం.. కర్ణాటకలోని ఎమ్మెల్యేల్లో 95శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. 26శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి!
Karnataka assembly elections : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) ఓ నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల్లో 95శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు!
ట్రెండింగ్ వార్తలు
నేరాలు కూడా ఎక్కువే..!
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. వీరిలో 219మంది ఆర్థిక, నేర చరిత్రలపై డేటాను రూపొందించింది ఏడీఆర్. ఈ 219లో 15 మంది ఎమ్మెల్యేలు.. 2018 ఎన్నికల అనంతరం పార్టీలు మారిపోయారు. ఈ 15 మందిలో 10 ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలస వెళ్లినవారే.
2023 Karnataka assembly elections : ఏడీఆర్ నివేదిక ప్రకారం.. తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు 26శాతం మంది ఎమ్మెల్యేలు వారివారి అఫిడవిట్లలో పేర్కొన్నారు. వీరిలో అత్యధిక మంది బీజేపీ(30శాతం)కి చెందిన వారే ఉన్నారు. ప్రధాన పార్టీల విషయానికొస్తే.. బీజేపీలోని 112 మంది ఎమ్మెల్యేల్లో 49మందిపై నేర కేసులు ఉన్నాయి. కాంగ్రెస్కు చెందిన 67 మంది ఎమ్మెల్యేల్లో 16మందిపై, జేడీఎస్లోని 30మందిలో 9మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తేలింది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లోని ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. బీజేపీలోని 35మంది, కాంగ్రెస్కు చెందిన 13మంది, జేడీఎస్లోని 8మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు తెలుస్తోంది.
అన్ని పార్టీల్లోనూ.. కోటీశ్వరులు!
మరోవైపు 118 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 112 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇందులోనూ కమలదళం టాప్లోనే ఉంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సగటు ఆస్తుల విలువ రూ. 29.85కోట్లుగా ఉంది. ఇందులో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ 48.58 కోట్లుగాను, బీజేపీ సగటు ఆస్తుల విలువ రూ. 19.60కోట్లుగాను ఉంది. జేడీఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ మాత్రం రూ. 4.34కోట్లుగానే ఉంది!
Karnataka polls latest news : కర్ణాటకలోని మొత్తం ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్కు ఉన్న అస్తులే (రూ. 840కోట్లు) ఎక్కువ. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకే చెందిన బీ సురేస్ (రూ. 416కోట్లు), ఎం కృష్ణప్ప (రూ. 236కోట్లు)లు ఉన్నారు.
నివేదిక ప్రకారం.. మొత్తం ఎమ్మెల్యేల్లోని ఇద్దరికి మాత్రమే డాక్టరేట్ డిగ్రీ ఉంది. 219 ఎమ్మెల్యేల్లో కేవలం 9మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే అది 4శాతం.
ADR report on Karnataka assembly elections : కర్ణాటకలో ఈ ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై త్వరలోనే ఈసీ నుంచి ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం