Free bus scheme : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం- కానీ టికెట్​ ఛార్జీలు మాత్రం భారీగా పెంపు..!-karnataka approves 15 percent hike in bus fares and bjp slams shakti scheme ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Free Bus Scheme : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం- కానీ టికెట్​ ఛార్జీలు మాత్రం భారీగా పెంపు..!

Free bus scheme : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం- కానీ టికెట్​ ఛార్జీలు మాత్రం భారీగా పెంపు..!

Sharath Chitturi HT Telugu
Jan 03, 2025 07:20 AM IST

Karnataka free bus scheme : కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు, బస్సు టికెట్​ ఛార్జీలను భారీగా పెంచేందుకు ఆ రాష్ట్ర కేబినెట్​ నిర్ణయించింది.

బస్సు టికెట్​ ఛార్జీలను భారీగా పెంచిన కర్ణాటక ప్రభుత్వం!
బస్సు టికెట్​ ఛార్జీలను భారీగా పెంచిన కర్ణాటక ప్రభుత్వం! (PTI)

కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పథకంతో చితికిపోతున్న కేఎస్​ఆర్​టీసీ (కర్ణాటక స్టేట్​ రోడ్​ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​)కి భారీ ఊరట! బస్సు టికెట్​ ధరలను 15శాతం పెంచేందుకు కర్ణాటక కేబినెట్​ ఆమోదం తెలిపింది. కేఎస్​ఆర్​టీసీతో పాటు కళ్యాన కర్ణాటక రోడ్​ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​ (కేకేఆర్​టీసీ), నార్త్​ వెస్టర్న్​ కర్ణాటక రోడ్​ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​ (ఎన్​డబ్ల్యూకేఆర్​టీసీ), బెంగళూరు మెట్రోపాలిటిన్​ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​ (బీఎంటీసీ)కి సైతం ఇది వర్తిస్తుంది.

yearly horoscope entry point

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ- కానీ టికెట్​ ఛార్జీలు పెంపు..!

తాజాగా పెంచిన బస్సు టికెట్​ ఛార్జీలు జనవరి 5న అమల్లోకి వస్తాయి. తాజా పెంపుతో కార్పొరేషన్స్​కి రోజుకు అదనంగా రూ. 7.84 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ఉచిత బస్సు పథకం కారణంగా డబ్బులు కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక బస్సు సర్వీసులకు ఇది ఊరటనిచ్చే విషయం.

2023లో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే శక్తి స్కీమ్​ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే! కర్ణాటకలో ఇది భారీ విజయాన్ని చూసింది. ఫలితంగా తెలంగాణలోనూ కాంగ్రెస్​ మేనిఫెస్టోలో దీనికి ఆదరణ లభించింది. అనంతరం కాంగ్రెస్​ కూడా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది.

అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెల సుమారు రూ. 420 కోట్ల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతి కార్పొరేషన్​కి రూ. 104 కోట్ల వరకు ఇస్తోంది. తాజాగా 15శాతం టికెట్​ ధరల పెంపుతో ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది.

వాస్తవానికి కర్ణాటకలో గడిచిన దశాబ్ద కాలంలో బస్సు టికెట్​ ధరలను పెద్దగా సవరించలేదు. 2014లో లీటర్​ డీజిల్​ ధర రూ. 30గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు రూ.95 దాటేంత వరకు బీఎంటీసీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కేఎస్​ఆర్​టీసీ, కేకేఆర్​టీసీ, ఎన్​డబ్ల్యూఆర్​టీసీ మాత్రం 2020లో టికెట్​ ఛార్జీలను కాస్త పెంచాయి.

బీజేపీ సీరియస్​..

అయితే, కర్ణాటకలో బస్సు టికెట్​ ధరలను పెంచడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసిది.

"ఉచిత పథకాలతో ప్రజలపై పరోక్షంగా భారాన్ని వేస్తున్నారు. ఇది బై వన్​ గెడ్​ వన్​ ఫ్రీ మార్కెటింగ్​ గిమ్మిక్​గా మారింది," అని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర మండిపడ్డారు.

"రోజూ ఏదో ఒక ధర పెంచి కన్నడ ప్రజల రక్తాన్ని తాగుతోంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వ దురాశల కోసం కన్నడ ప్రజలు ఇంకెన్ని ట్యాక్స్​లు, ఛార్జీలు కట్టాలి?" అని మరో బీజేపీ నేత ఆర్​ అశోక్​ ప్రశ్నించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.