వామపక్షాలతో ఏబీవీపీ బిగ్​ ఫైట్​- జేఎన్​యూ ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే..-jnu election results left sweeps central panel polls abvp marks major comeback ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వామపక్షాలతో ఏబీవీపీ బిగ్​ ఫైట్​- జేఎన్​యూ ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే..

వామపక్షాలతో ఏబీవీపీ బిగ్​ ఫైట్​- జేఎన్​యూ ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే..

Sharath Chitturi HT Telugu

జేఎన్​యూ స్టూడెంట్​ యూనియన్​ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వామపక్షాలు పైచేయి సాధించగా, ఏబీవీపీ మాత్రం అంచనాలకు మించిన పర్ఫార్మెన్స్​ చేసి కమ్​బ్యాక్​ ఇచ్చింది! పూర్తి వివరాలు..

జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ

దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన దిల్లీ జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్​ యూనియన్​ (జేఎన్​యూఎస్​యూ) ఎన్నికలపై బిగ్​ అప్డేట్​! వామపక్షాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. టాప్​ 4 పోస్టులకు గాను మూడింటిని కైవశం చేసుకున్నాయి. కాగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషద్​ (ఏబీవీపీ) చాలా కాలం తర్వాత ఒక పోస్టు దక్కించుకుని కమ్​బ్యాక్​ ఇచ్చింది.

జేఎన్​యూఎస్​యూ ఎన్నికల ఫలితలు..

ఏప్రిల్​ 18న జరగాల్సిన జేఎన్​యూఎస్​యూ ఎన్నికలు.. క్యాంపస్​లో హింస వంటి కారణాలతో ఆలస్యమై, చివరికి ఏప్రిల్​ 25న జరిగాయి. దాదాపు 70శాతం మంది ఓటు వేశారు. అంటే సుమారు 5,500మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తాజాగా వెలువడిన జేఎన్​యూఎస్​యూ ఎన్నికల ఫలితాల్లో నితీశ్​ కుమార్​ (ఏఐఎస్​ఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మనీష (డీఎస్​ఎఫ్​) వైస్​-ప్రెసిడెంట్​ పదవిని దక్కించుకున్నారు. ఫాతిమా (డీఎస్​ఎఫ్​) జనరల్​ సెక్రటరీ పదవిని సొంతం చేసుకున్నారు.

"విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తాము. ప్రతి విద్యార్థి గొంతుకను అందరు గౌరవించి, వారి మాటలను వినేలా చేయడమే మా లక్ష్యం," అని జేఎన్​యూఎస్​యూ నూతన అధ్యక్షుడు నితీశ్​ కుమార్​ తెలిపారు.

చాలా కాలం తర్వాత గట్టి పోటీ ఇచ్చిన ఏబీవీపీ !

ఈ దఫా ఎన్నికల్లో ఏబీవీపీ ప్రదర్శన హైలైట్​గా నిలించింది. దశాబ్ద కాలంగా ఒక్క పోస్టు కూడా గెలవని ఏబీవీపీ.. ఈ దఫా జరిగిన జేఎన్​యూ ఎన్నికల ఫలితాల్లో అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక పోస్టును దక్కించుకుంది. ఏబీవీపీకి చెందిన వైభవ్​ మీనా జాయింట్​ సెక్రటరీ పదవిని కైవశం చేసుకున్నారు.

వాస్తవానికి కౌంటింగ్​ జరుగుతున్న సమయంలో సెంట్రల్​ ప్యానెల్​ రేసులో ఏబీవీపీ అభ్యర్థులు ముందు వరుసలో నిలబడ్డారు. సాంప్రదాయ జేఎన్​యూ వామపక్ష ఆధిపత్యానికి ఈ ఏబీవీపీ అభ్యర్థులు బలమైన పోటీని ఇచ్చారు. కానీ చివరికి వచ్చేసరికి ప్రెసిడెంట్​, వైస్​-ప్రెసిడెంట్​, జనరల్​ సెక్రటరీ పదవుల్లో ఓడిపోయి.. జాయింట్​ సెక్రటరీ పోస్టుతో సరిపెట్టుకుంది ఏబీవీపీ.

కానీ తాజా జేఎన్​యూఎస్​యూ ఫలితాలతో ఒక విషయం స్పష్టమవుతోంది. ఏబీవీపీ అభ్యర్థులు- ఇతర అభ్యర్థుల మధ్య గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువ ఉంది. దీనిబట్టి జేఎన్​యూ వ్యవహారాల్లో మార్పు కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

ఈ దఫా ఎన్నికల్లో ఏఐఎస్​ఏ- డీఎస్​ఎఫ్​, ఏబీవీపీ, ఎన్​ఎస్​యూఐ- ఫ్రెంటర్నిటీ కూటమి పాల్గొన్నాయి.

కౌన్సిలర్​ ఎన్నికల విషయానికి వచ్చేసరికి, 42 సీట్లకుగాను 23 చోట్ల గెలిచి చరిత్ర సృష్టించింది ఏబీవీపీ. 1999 నుంచి ఇదే బెస్ట్​ పర్ఫార్మెన్స్​!

ఏబీవీపీ పుంజుకోవడంతో జేఎన్​యూ క్యాంపస్​ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఈసారి వచ్చిన ఫలితాలను ఏబీవీపీ లీడర్లు, మద్దతుదారులు 'టర్నింగ్​ పాయింట్​' అని అభివర్ణించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.