JEE Main 2025 : గడువు పొడిగింపు లేదు- తేల్చి చెప్పిన ఎన్టీఏ! జేఈఈ మెయిన్స్​ రిజిస్ట్రేషన్​ చివరి తేదీ ఇదే..-jee main 2025 registration no extension of last date to apply says nta ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2025 : గడువు పొడిగింపు లేదు- తేల్చి చెప్పిన ఎన్టీఏ! జేఈఈ మెయిన్స్​ రిజిస్ట్రేషన్​ చివరి తేదీ ఇదే..

JEE Main 2025 : గడువు పొడిగింపు లేదు- తేల్చి చెప్పిన ఎన్టీఏ! జేఈఈ మెయిన్స్​ రిజిస్ట్రేషన్​ చివరి తేదీ ఇదే..

Sharath Chitturi HT Telugu
Published Nov 19, 2024 01:40 PM IST

జేఈఈ మెయిన్ 2025 సెషన్​ 1 దరఖాస్తు ప్రక్రియను పొడిగించడం లేదని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ఎన్టీఏ తేల్చిచెప్పింది. పూర్తి వివరాలు..

జేఈఈ మెయిన్స్​ రిజిస్ట్రేషన్​ చివరి తేదీ ఇదే..
జేఈఈ మెయిన్స్​ రిజిస్ట్రేషన్​ చివరి తేదీ ఇదే..

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్) 2025 సెషన్​ 1 దరఖాస్తు ప్రక్రియను పొడిగించడం లేదని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ఎన్టీఏ తేల్చిచెప్పింది. నవంబర్​ 22, అంటే శుక్రవారం జేఈఈ మెయిన్స్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఈలోపే దరఖాస్తులు చేసుకోవాలని స్పష్టం చేసింది.

అయితే గడువులోగా దరఖాస్తు చేసుకుని ఫారాల్లో మార్పులు చేసుకోవాల్సిన వారికి నవంబర్ 26 నుంచి 27 వరకు కరెక్షన్ విండో లభిస్తుందని ఎన్టీఏ తెలిపింది.

అందువల్ల, జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ప్రయత్నించాలనుకునే అభ్యర్థులు గడువులోగా రిజిస్టర్ చేసుకుని తమ దరఖాస్తు ఫారాలను సమర్పించాలి. ఎలాంటి సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడకూడదడంటే, చివరి తేదీ వరకు ఆగకుండా, ఎంత వీలైతే అంత తొందరగా రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమం!

కరెక్షన్​ విండో వివరాలు..

జేఈఈ మెయిన్ 2025 కరెక్షన్ విండోలో అభ్యర్థులు ఎడిట్ చేయడానికి అనుమతించిన రంగాలను కూడా ఏజెన్సీ పంచుకుంది.

అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ చిరునామా, శాశ్వత / ప్రస్తుత చిరునామా, అత్యవసర సంప్రదింపు వివరాలు, ఫోటోలను మార్చడానికి అనుమతి ఉండదు. అందువల్ల, ఈ ఫీల్డ్​లను నింపేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ కింది వివరాల్లో దేనినైనా మార్చవచ్చు-

  • పేరు
  • తల్లి పేరు[మార్చు]
  • తండ్రి పేరు[మార్చు]
  • 10వ తరగతి/తత్సమాన వివరాలు
  • 12వ తరగతి/తత్సమాన వివరాలు
  • పాన్ నెంబరు
  • పుట్టిన తేది
  • లింగము
  • కేటగిరీ
  • ఉప వర్గం
  • పీడబ్ల్యూడీ స్టేటస్​
  • సంతకం.

అభ్యర్థులు పేపర్, పరీక్ష మాధ్యమం, పరీక్షా కేంద్రాల ప్రాధాన్యతను కూడా మార్చుకోవచ్చు.

అభ్యర్థుల శాశ్వత, ప్రస్తుత చిరునామాల ఆధారంగా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు ఇచ్చిన ఛాయిస్​లను పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఫారంలో మార్పు కారణంగా దరఖాస్తు ఫీజు పెరిగితే, అభ్యర్థులు దిద్దుబాట్ల సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తర్వాత మాత్రమే ఫీల్డ్స్ అప్డేట్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి.

అయితే కరెక్షన్ తర్వాత ఫీజు తగ్గితే ఏజెన్సీ అభ్యర్థులకు రీఫండ్ ఇవ్వదని గుర్తుపెట్టుకోవాలి.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ స్టెప్స్​ని అనుసరించవచ్చు.

jeemain.nta.nic.in వద్ద ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 రిజిస్ట్రేషన్ లింక్​పై క్లిక్ చేయండి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత అకౌంట్​లోకి లాగిన్ అవ్వాలి.

అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

సబ్మిట్ బటన్​పై క్లిక్ చేసి పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.

తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.