భారత్-పాక్ ఘర్షణలపై అమెరికా సంచలన వ్యాఖ్యలు-jd vances big claim on india pakistan us vp says none of our business ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్-పాక్ ఘర్షణలపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

భారత్-పాక్ ఘర్షణలపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

Sudarshan V HT Telugu

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. పాక్ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన భారత్, పాక్ పై ముప్పేట దాడిని తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో, భారత్, పాక్ ఘర్షణలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (Getty Images via AFP)

భారత్-పాక్ ల మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న ఘర్షణలపై అమెరికా స్పందించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనిపై వ్యాఖ్యానిస్తూ, ఆ ఘర్షణలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అది ప్రాథమికంగా తమ పని కాదని అన్నారు. ‘ఈ సంఘర్షణకు, దాన్ని నియంత్రించే అమెరికా సామర్థ్యానికి ఎలాంటి సంబంధం లేదని జేడీ వాన్స్ అన్నారు. 'వీలైనంత త్వరగా ఘర్షణను తగ్గించాలని' అమెరికా కోరుకుంటోందని అన్నారు.

మేం పట్టించుకోం..

భారత్, పాకిస్తాన్ ల మధ్య ఘర్షణలకు తమకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశం అన్నారు. ‘‘ఈ దేశాలను మనం నియంత్రించలేము. ప్రాథమికంగా, ా రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు తీవ్రమయ్యాయి. మనం చేయగలిగేది ఏమిటంటే, వారిని ఈ ఉద్రిక్తతలను తగ్గించమని కోరడం మాత్రమే. ప్రాథమికంగా ఆ ఘర్షణలతో మనకు సంబంధం లేదు. అమెరికా దానిని నియంత్రించే సామర్థ్యంతో ఎటువంటి సంబంధం లేని యుద్ధంలో మనం పాల్గొనబోము’’ అని వాన్స్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ స్పందన

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం భారత్, పాకిస్తాన్ ఘర్షణలపై స్పందించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు. “నాకు రెండు దేశాలు బాగా తెలుసు. రెండింటితో మంచి సంబంధాలు కలిగి ఉన్నాము. వారు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఘర్షణలు ఆగిపోవాలని నేను కోరుకుంటున్నాను”అని ట్రంప్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు.

ఆపరేషన్ సిందూర్

పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా మంగళవారం రాత్రి పాకిస్తాన్‌పై భారతదేశం తన ఆపరేషన్ సిందూర్ దాడులను ప్రారంభించింది. గురువారం రాత్రి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ మరియు కొన్ని ఇతర ప్రదేశాలలోని సైనిక స్థావరాలపై క్షిపణులు మరియు డ్రోన్‌లతో దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారతదేశం విజయవంతంగా అడ్డుకుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.