జపాన్​ మరో అద్భుతం- పిడుగును ‘కంట్రోల్​’ చేసే టెక్నాలజీ ఇది..-japan does a miracle again develops worlds first technology to control lightning strikes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జపాన్​ మరో అద్భుతం- పిడుగును ‘కంట్రోల్​’ చేసే టెక్నాలజీ ఇది..

జపాన్​ మరో అద్భుతం- పిడుగును ‘కంట్రోల్​’ చేసే టెక్నాలజీ ఇది..

Sharath Chitturi HT Telugu

జపాన్​ మరో అద్భుతం చేసింది! తమ దేశంలో సమస్యగా మారిన ‘పిడుగు’లను కంట్రోల్​ చేసి, దారి మళ్లించే విధంగా ఒక ప్రత్యేక టెక్నాలజీని రూపొందించింది.

పిడుగును కంట్రోల్​ చేసే టెక్నాలజీని రూపొందించిన జపాన్​

'పిడుగు పడి ఏడుగురు మృతి', 'పిడుగుపాటుకు ఆరుగురు బలి' అని నిత్యం వార్తలు వింటూనే ఉంటాము. మరీ ముఖ్యంగా వర్షా కాలంలో పిడుగు అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడుతుందో అంచనా వేయడం ఆ నిమిషంలో కష్టం కాబట్టి, పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఈ సమస్యకు జపాన్​ శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని కనుగొన్నారు! పిడుగును కంట్రోల్​ చేసే విధంగా ఒక టెక్నాలజీని రూపొందించారు. ఈ టెక్నాలజీ ద్వారా మెరుపును కంట్రోల్​ చేసి, దాన్ని సురక్షిత ప్రాంతంలో పడే విధంగా దారి మళ్లిస్తారు. పిడుగుపాటు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకే ఈ టెక్నాలజీని తీసుకొచ్చినట్టు జపాన్​ చెబుతోంది. అసలేంటి ఈ టెక్నాలజీ?

పిడుగును కంట్రోల్​ చేసే టెక్నాలజీ..

జపాన్​ రూపొందించిన ఈ టెక్నాలజీ.. ప్రపంచంలోనే తొలి వాతావరణ కంట్రోల్​ వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. మెరుపులను ఇది పూర్తిస్థాయిలో కంట్రోల్​ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిడుగును కంట్రోల్​ చేసేందుకు ఈ స్పెషల్​ డ్రోన్​ టెక్నాలజీని జపాన్​ రూపొందించింది. ఇందులో భాగంగా ఒక డ్రోన్​ మేఘాల్లోకి వెళ్లి, వాటిల్లో ఏర్పడే మెరుపులను కంట్రోల్​ చేస్తుంది. అనంతరం సరక్షిత ప్రాంతాల్లో అవి పడే విధంగా ఈ టెక్నాలజీ చర్యలు చేపడుతుంది.

మెరుపుల వల్ల జపాన్​కు ప్రతియేటా 113.66 బిలియన్ల నష్టం వాటిల్లుతోందని అంచనాలు ఉన్నాయి. వాటిని తగ్గించడంతో పాటు ప్రజా భద్రత దృష్ట్యా జపాన్​కి చెందిన నిప్పాన్​ టెలిగ్రాఫ్​ అండ్​ టెలిఫోన్​ కార్పొరేషన్​ ఈ ప్రాజెక్ట్​ని డెవలప్​ చేసింది. రెండు నెలల పాటు ఈ టెక్నాలజీని పరీక్షించారు. గతేడాది డిసెంబర్​లో హమద అనే నగరంలో ఈ టెక్నాలజీ టెస్టింగ్​ మొదలైంది. ఒక డ్రోన్​ని ఎగిరేసి, మేఘాల్లోకి తీసుకెళ్లారు. మేఘాల్లోకి వెళ్లిన తర్వాత ఈ డ్రోన్​ ఒక ఎలక్ట్రికల్​ ఫీల్డ్​ని డిటెక్ట్​ చేసింది. ఆ తర్వాత డ్రోన్​కి ఉన్న ఒక స్విచ్​ని కింద ఉన్న శాస్త్రవేత్తలు యాక్టివేట్​ చేశారు. ఆ తర్వాత, పిడుగును కంట్రోల్​ చేసినట్టు, దాని దిశను మార్చి, సురక్షిత ప్రాంతంలో పడేసినట్టు జపాన్​ అధికారులు వెల్లడించారు.

ఈ టెక్నాలజీలో ఉపయోగించిన డ్రోన్​ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఒక ప్రత్యేక లోహంతో తయారు చేసిన కేజ్​ (బోను)లో దానిని పెట్టారు. ఈ బోను.. మెరుపులను తట్టుకోగలదు. డ్రోన్​లోని కొన్ని సున్నితమైన ప్రాంతాలకు మాత్రమే మెరుపు చేరుకోగలుగే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.

జపాన్​లోని నగరాలు, భారీ భవనాలు, ఫ్యాక్టరీలు, ఇతర మౌలికవసతులను రక్షించేందుకు ఈ తరహా డ్రోన్​ టెక్నాలజీని రూపొందించారు.

ఈ కొత్త టెక్నాలజీతో పిడుగులపై పరిశోధనలు కూడా చేయవచ్చు. అవి ఏర్పడటానికి వెనక కారణాలను మరింత లోతుగా విశ్లేషించవచ్చు. తద్వారా మరింత మెరుగైన వ్యవస్థలను రూపొందించవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.