Jammu Kashmir terror attack : సైన్యంపై ఉగ్రదాడి.. ముమ్మరంగా దర్యాప్తు- రంగంలోకి ఎన్ఐఏ
Jammu Kashmir terror attack : ఐదుగురు సైనికుల మరణానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. గురువారం ట్రక్పై జరిగిన ఉగ్రదాడిలో ఈ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Jammu Kashmir terror attack : జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సైనికుల ట్రక్పై దాడి జరిపి, ఐదుగురి ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అధికారులు అనేక ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఏం జరిగింది..?
ఉగ్రవాదుల ఏరివేత కార్యకలాపాల కోసం మోహరించిన సైనికుల బృందం గురువారం మధ్యాహ్నం పూంచ్ నుంచి బయలుదేరింది. ఈ సైనికులందరు.. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందిన వారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఐదుగురిలో నలుగురు పంజాబ్కు చెందిన వారే ఉన్నారు.
Terror attack in Jammu Kashmir : తొలుత.. ఇది ట్రక్కు జరిగిన ప్రమాదమని అందరు భావించారు. కానీ ఇదొక ఉగ్రదాడి అని తేలింది. ట్రక్పై 25కుపైగా బుల్లెట్లు ఉన్నాయి. దీని బట్టి.. ట్రక్కు నలువైపుల నుంచి దాడి జరిగినట్టు స్పష్టమైంది. అనేకమంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఉగ్రవాదుల ఏరివేత..
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ బృందం.. ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నట్టు సమాచారం.
Soldiers killed in terror attack : మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఉగ్రవాదులు తప్పించుకోలేకుండే.. ప్రణాళికలు రచించారు.
సైనికులపై ఉగ్రదాడి ఘటనను రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు వివిధ పార్టీల నేతలు ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. సైనికుల మరణవార్త తమకు ఎంతో బాధకలిగించిందని వివరించారు.
పాక్ మంత్రి వస్తారా?
Bilawal Bhutto India visit : ఎస్సీఓ (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సదస్సులో పాల్గొనేందుకు.. ఇండియాకు రావాలని పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై గురువారం ప్రకటన వెలువడింది. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే జమ్ముకశ్మీర్లో సైనికులపై ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో.. బిలావల్ భుట్టో భారత్ పర్యటన ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక వేళ ఆయన ఇండియాకు వస్తే.. ఓ పాక్ విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటించడం, 2011 తర్వాత ఇదే తొలిసారి అవుతుంది!
సంబంధిత కథనం