ఇస్లామిక్ స్టేట్ ఉగ్రనేత అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మృతి, కొత్త నాయకుడి పేరు ప్రకటన
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన నాయకుడు అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మరణాన్ని ఐఎస్ గురువారం ఒక ప్రకటనలో ధృవీకరించింది.
Damascus | ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన నాయకుడు అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మరణాన్ని ఐఎస్ గురువారం ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈమేరకు అడిని స్థానంలో అబూ హసన్ అల్-హషేమీ అల్-ఖురాషీ బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించింది.
ఇస్లామిక్ స్టేట్ జిహాదీలు "అబు హసన్ అల్-హషేమీ అల్-ఖురాషిపై విశ్వాసబద్ధంగా ఉంటాం, ముస్లింల ఖలీఫాగా విధేయత చూపుతాం" అని ప్రమాణం చేసినట్లు ఈ ఉగ్రసంస్థకు చెందిన ప్రతినిధి ఒక ఆడియో రికార్డింగ్లో తెలిపారు. దీని ప్రకారం ఈ సంస్థ పూర్వ నాయకుడైన అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ మరణం నిజమేనని ధృవీకరణ జరిగింది.
Here's the update:
సిరియా దేశంలోని వాయువ్య ప్రాంతం ఐఎస్ జిహాదీల నియంత్రణలో ఉంటుంది. అయితే ఉగ్రవాద ఏరివేతలో భాగంగా అమెరికా గత ఫిబ్రవరి నెలలో ఈ ప్రాంతంలో దాడులు నిర్వహించింది. ఆ సమయంలో మిలిటెంట్ గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే అతడు చనిపోయాడా లేదా అనేది అప్పుడు ధృవీకరణ కాలేదు. తాజాగా కొత్త నాయకుడు రావడంతో ఈ విషయంలో స్పష్టత లభించినట్లయింది.
సంబంధిత కథనం