పాకిస్థాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్కూల్‌లో ఫెయిల్యూర్ ప్రాజెక్టు లాంటిది : అంతర్జాతీయ మీడియా-international media comments on pakistan press conference showed fake pictures instead of evidence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాకిస్థాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్కూల్‌లో ఫెయిల్యూర్ ప్రాజెక్టు లాంటిది : అంతర్జాతీయ మీడియా

పాకిస్థాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్కూల్‌లో ఫెయిల్యూర్ ప్రాజెక్టు లాంటిది : అంతర్జాతీయ మీడియా

Anand Sai HT Telugu

భారత్- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అనంతరం ఇరు దేశాల సైన్యాలు మీడియా సమావేశం నిర్వహించాయి. అయితే అంతర్జాతీయ మీడియా భారత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఖచ్చితమైనది, వాస్తవికమైనదిగా అభివర్ణించింది. కానీ పాకిస్థాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కామెడీగా చెప్పింది.

పాకిస్థాన్ ఆర్మీ

ారత్-పాక్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టాలు, లక్ష్యాలపై ఇరు దేశాల సైన్యాలు విలేకరుల సమావేశం పెట్టాయి. భారత్ తరఫున జరిగిన విలేకరుల సమావేశంలో సైనికాధికారులు చాలా కచ్చితత్వంతో, వాస్తవికంగా అసలు విషయాలను చెప్పారు.

అదే సమయంలో పాక్ కూడా మీడియా సమావేశం నిర్వహించింది. ఇరు దేశాలు చేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ల గురించి అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారత ప్రెస్ కాన్ఫరెన్స్ బాగుందని, వాస్తవికంగా ఉందని అందరూ అభివర్ణించగా, పాక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను అపహాస్యం చేశారు.

రెండు దేశాల ప్రెస్ కాన్ఫరెన్స్‌కు, ప్రజల స్పందనకు మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ఆస్ట్రేలియా వార్తా సంస్థ స్కై న్యూస్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. భారతదేశ ప్రెస్ కాన్ఫరెన్స్ ఖచ్చితమైన, పూర్తి వాస్తవాల ఆధారంగా ఎలా జరిగిందో ఈ వీడియో తెలిపింది. దాడులకు ముందు, తర్వాత భారత సైన్యం తన లక్ష్యాలను స్పష్టం చేసింది, దాడిలో మరణించిన ఉగ్రవాదుల పేర్లను కూడా తెలిపింది. అంతేకాదు కచ్చితమైన సమాచారం తర్వాతే తమ ఆయుధాలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని సైన్యం స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సైన్యం ఎటువంటి వాస్తవిక ప్రకటనను సమర్పించలేదని, ఎటువంటి ఆధారాలు చూపించలేదని అంతర్జాతీయ మీడియా తెలిపింది. సోషల్ మీడియాలో విడుదలయ్యే చిత్రాల ఆధారంగానో, అక్కడ జరుగుతున్న అబద్ధాలు, వాదనల ఆధారంగానో వారి సమావేశం మొత్తం తయారైందని పేర్కొంది.

అంతేకాదు పాక్ వైపు నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్‌ను మరింతగా చూపించేందుకు భారత మీడియా సంస్థల క్లిప్‌లను కట్ చేశారు. భారత్‌కు చెందిన పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని పాక్ పేర్కొన్నప్పటికీ సాక్ష్యాధారాల పేరుతో తమ వద్ద ఏమీ లేదని పేర్కొంది.

ఈ రెండు ప్రెస్ కాన్ఫరెన్స్‌లను చూసిన తరువాత భారత ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు పాకిస్థాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక పాఠశాల విఫల ప్రాజెక్టును పోలి ఉందని అభివర్ణించింది. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉగ్రవాది రవూఫ్‌ను అమాయక మతగురువుగా చూపించే ప్రయత్నం జరిగింది. ఇదే రవూఫ్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.