IndiGo : మళ్లీ ‘సెలవులు’ పెట్టేసిన ఇండిగో ఉద్యోగులు..!
Indigo : ఇండిగోలో ‘సెలవుల’ హడావుడి నడుస్తోంది. తాజాగా.. అనేకమంది టెక్నీషియన్లు.. ఒకేసారి సెలవులు పెట్టేశారు.
Indigo : దేశీయ విమానాయన సంస్థ ఇండిగోలో సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. వేతనాలపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవులు పెట్టేస్తున్నారు. తాజాగా.. గత రెండు రోజులుగా విమాన నిర్వహణ టెక్నీషియన్లు.. సిక్ లీవ్లు పెట్టినట్టు ఓ నివేదిక పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
తక్కువ జీతాలపై నిరసన తెలిపేందుకు హైదరాబాద్, ఢిల్లీకి చెందిన టెక్నీషియన్లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమపై యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టేందుకు వీలు లేకుండా.. 'సిక్ లీవ్'లను ఉపయోగించుకున్నారు.
కాగా ఈ వ్యవహారంపై ఇండిగో ఇంకా స్పందించలేదు.
అయితే వేతనాలపై ఇండిగో ఉద్యోగులు ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇది కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం.. ఇండిగోకు చెందిన చాలామంది పెలట్లు, క్యాబిన్ సిబ్బంది.. ఒకేసారి సెలవులు పెట్టి.. ఎయిర్ ఇండియాలో రిక్రూట్మెంట్ డ్రైవ్కు వెళ్లారు! ఫలితంగా.. 55శాతం విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
కొవిడ్-19 పేరుతో ఉద్యోగుల జీతాలను గతంలో తగ్గించేసింది ఇండిగో. వాటిని ఇంకా పెంచలేదు. ఫలితంగా ఉద్యోగుల్లో అసంతృప్తి, అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది.
ఇదిలా ఉండగా.. బిగ్ బుల్ రాకేష్ ఝన్ఝున్వాలాకు చెందిన ఆకాశా ఎయిర్లైన్స్ కూడా నియామకాల కోసం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇండిగో ఉద్యోగులు వాటిపైనా కన్నేసినట్టు సమాచారం.
సంబంధిత కథనం