Railways Navratri special menu: నవరాత్రులకు రైళ్లలో స్పెషల్ మెనూ
Railways Navratri special menu: దసరా నవరాత్రుల సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం స్పెషల్ మెనూ తీసుకొచ్చింది.
Railways Navratri special menu: నవరాత్రుల సందర్భంగా రైలులో ప్రయాణించే భక్తుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రత్యేక మెనూను ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ ప్రత్యేక ఆర్డర్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు అందిస్తామని, 'ఫుడ్ ఆన్ ట్రాక్' యాప్ నుండి ఆర్డర్ చేయవచ్చని తెలిపింది.
‘నవరాత్రి పవిత్ర పండుగ సందర్భంగా భారతీయ రైల్వే మీ వ్రత కోరికలను తీర్చడానికి ఒక ప్రత్యేక మెనూ మీకు అందిస్తుంది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు దీనిని అందిస్తాం. మీ రైలు ప్రయాణం కోసం 'ఫుడ్ ఆన్ ట్రాక్' యాప్ నుండి నవరాత్రి రుచికరమైన వంటకాలను ఆర్డర్ చేయండి. కేటరింగ్ను సందర్శించండి. ఐఆర్సీటీసీ లేదా 1323కి కాల్ చేయండి..’ అని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవ విశేషాలు
దుర్గా మాత తొమ్మిది రోజుల ఉత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు కలషం లేదా ఘటస్థాపనతో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా హిందువులు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
భారతదేశంలో, నవరాత్రిని అనేక రకాలుగా జరుపుకుంటారు. రామలీలా పేరుతో రామాయణంలోని సన్నివేశాలను ప్రదర్శించే వేడుకలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్. మధ్యప్రదేశ్లలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. రావణుడి దిష్టిబొమ్మల దహనం విజయదశమి నాడు కథ ముగింపుని సూచిస్తుంది.
తెలంగాణలో దేవీ నవరాత్రులను బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజించడం ద్వారా నిర్వహిస్తారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాలతో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది.