Flight Peeing Incident: విమానంలో తోటి ప్యాసింజర్పై మూత్రం పోసిన వ్యక్తి.. మరోసారి పీయింగ్ ఘటన
Flight Peeing Incident: ఫ్లైట్లో మరో పీయింగ్ ఘటన నమోదైంది. ఢిల్లీకి వచ్చిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఇది జరిగింది. వివరాలివే.
Flight Peeing Incident: విమానంలో మరోసారి పీయింగ్ ఘటన జరిగింది. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానంలో ఓ తోటి ప్యాసింజర్పై ఓ వ్యక్తి మూత్రం పోశారు. మద్యం మత్తులో ఓ భారతీయ ప్రయాణికుడు ఇలా అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మద్యం సేవించిన తర్వాత తోటి ప్యాసింజర్తో వాదన జరగగా.. ఈ క్రమంలో ఆయన మూత్రం పోసినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆయనను భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
Flight Peeing Incident: న్యూయార్క్ జెఫ్ ఎఫ్.కెనడీ అంతర్జాతీయ విమాశ్రయం (JKF) నుంచి న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (DEL)కు వచ్చిన విమానం ఏఏ 292లో ఈ ఇబ్బంది తలెత్తిందని అమెరికన్ ఎయిర్లైన్స్ పేర్కొంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ విమానం ఢిల్లీకి చేరుకుంది. అయితే, ల్యాండింగ్కు ముందే ఢిల్లీ విమానాశ్రయ సిబ్బందికి అమెరికన్ ఎయిర్లైన్స్ ఉద్యోగులు ముందే సమాచారం ఇచ్చారు.
Flight Peeing Incident: ఢిల్లీలో విమానం దిగగానే సీఐఎస్ఎఫ్ అధికారులకు ఘటన గురించి విమాన సిబ్బంది ఫిర్యాదు చేశారు. తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన వ్యక్తిని అరెస్టు చేసి.. ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్కు తరలించారు భద్రతా సిబ్బంది.
Flight Peeing Incident: గత నెల కూడా ఇలాంటి ఘటనే జరిగింది. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఓ విమానంలో ఓ అమెరికన్పై ఓ భారతీయ విద్యార్థి మూత్రం పోశారు. అది కూడా అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలోనే జరిగింది. ఈ ఘటన తర్వాత ఆర్యా వోహ్రా అనే ఆ వ్యక్తిపై అమెరికన్ ఎయిర్లైన్స్ బ్యాన్ విధించింది.
గతేడాది నవంబర్లో ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి.. తోటి ప్యాసింజర్పై మూత్రం పోశారు. ఇది కూడా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలోనే జరిగింది. నవంబర్లో జరిగిన ఈ ఘటన జనవరిలో వెలుగులోకి వచ్చింది.
విమానంలో మంటలు
Flight Engine Fire: నేపాల్ నుంచి దుబాయ్కి బయలుదేరిన ఫ్లై దుబాయ్ (Fly Dubai) విమానంలో సోమవారం మంటలు చెలరేగాయి. ఖట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ఇంజిన్లో మంటలు రేగినట్టు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఈ విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, మంటలు అదుపులోకి వచ్చి ఇండికేటర్లు నార్మల్గా చూపటంతో దుబాయ్కు విమాన ప్రయాణం కొనసాగినట్టు తెలుస్తోంది.