శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా.. ప్రయోగానికి ముందు బయటపడిన పెద్ద లోపం!-indian astronaut shubhanshu shukla axiom 4 space mission launch postponed due to oxygen leak ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా.. ప్రయోగానికి ముందు బయటపడిన పెద్ద లోపం!

శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా.. ప్రయోగానికి ముందు బయటపడిన పెద్ద లోపం!

Anand Sai HT Telugu

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా యాక్సియం-4 మిషన్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. ప్రయోగానికి కొన్ని గంటల ముందు ఒక పెద్ద లోపం కనిపంచింది.

శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా (HT_PRINT)

ఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో కూడిన యాక్సియం-4(ఏఎక్స్-4) మిషన్ ప్రయోగాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యాక్సియం-4 మిషన్ ప్రయోగాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పేస్ఎక్స్ తెలిపింది. ప్రస్తుతానికి కొత్త తేదీ ఇవ్వలేదు. బూస్టర్ యొక్క పోస్ట్-స్టాటిక్ ఫైర్ తనిఖీ సమయంలో లిక్విడ్ ఆక్సిజన్(ఎల్ఎక్స్) లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఎల్ఎక్స్ లీకేజీని సరిచేయడానికి స్పేస్ఎక్స్ బృందం అదనపు సమయం తీసుకునేందుకు వీలుగా ప్రయోగాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు స్పేస్ఎక్స్ తెలిపింది. మరమ్మతు పనులు పూర్తవడం, రేంజ్ లభ్యత ఆధారంగా కొత్త లాంచ్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది.

ఏఎక్స్-4 మిషన్ అనేది ఆక్సియం స్పేస్ నిర్వహించే ప్రైవేట్ స్పేస్ ట్రావెల్ మిషన్. దీనిలో అంతర్జాతీయ వ్యోమగాముల బృందం అంతరిక్షానికి బయలుదేరుతుంది. ఈ మిషన్ శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక పరీక్షలు, వాణిజ్య కార్యకలాపాలతో ముడిపడి ఉంది.

రాకెట్ ఇంధనంలో ఎల్ఎక్స్ అంటే లిక్విడ్ ఆక్సిజన్ ఒక ముఖ్యమైన భాగం. బూస్టర్ భద్రతా తనిఖీలో లీకేజీని గుర్తించడంతో ప్రమాదం ఉన్నందున మిషన్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. స్పేస్ ఎక్స్ ఈ నిఘా దాని భద్రతా ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది.

ఆక్సియం-4 మిషన్ కింద 14 రోజుల పాటు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రణాళికలు ఉన్నాయి. దీని కింద మైక్రోగ్రావిటీ, లైఫ్ సైన్స్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన పరిశోధనలు జరగాల్సి ఉంది. దాదాపు 30 దేశాల పరిశోధకులు ఈ మిషన్‌తో సంబంధం కలిగి ఉన్నారు.

భారతదేశం కూడా తన సొంత శక్తితో అంతరిక్ష యాత్ర(గగన్‌యాన్)కు సిద్ధమవుతోంది. గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపిక చేసిన 4 మంది వ్యోమగాములను భారతదేశం అంతరిక్షంలోకి పంపుతుంది. 2027 నాటికి ప్రయోగించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.