Indian Army dog : ‘నిజమైన హీరో’- ఉగ్రవాదుల ఏరివేతలో అర్మీ శునకం వీర మరణం-indian army dog phantom dies heroically in clash with terrorists in jk ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Army Dog : ‘నిజమైన హీరో’- ఉగ్రవాదుల ఏరివేతలో అర్మీ శునకం వీర మరణం

Indian Army dog : ‘నిజమైన హీరో’- ఉగ్రవాదుల ఏరివేతలో అర్మీ శునకం వీర మరణం

Sharath Chitturi HT Telugu

Indian Army dog Phantom dies : విధుల్లో ఉండగా భారత సైన్యానికి చెందిన శునకం వీర మరణం పొందింది. ఉగ్రవాదుల కాల్పులో గాయపడిన ఫాంటమ్​ కన్నుమూసినట్టు వైట్​ నైట్​ కార్ప్స్​ వెల్లడించింది.

ఆర్మీ శునకం ఫాంటమ్​ (White Knight Corps)

సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్​ సుందర్బనీ సెక్టార్లోని అసన్ సమీపంలో ఆర్మీ కాన్వాయ్​పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి చెందింది. ఆర్మీ శునకం మృతి చెందినట్లు వైట్ ​నైట్ కార్ప్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

"మా నిజమైన హీరో వీర మరణానికి మేము సెల్యూట్ చేస్తున్నాము. ఒక ధైర్యవంతుడైన #IndianArmy శునకం, #Phantom," అని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్​లో పోస్ట్ చేసింది.

ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా వారిని ఆర్మీ చుట్టుముట్టింది. అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే ఫాంటమ్​ శరీరంలోకి బుల్లెట్​లు దూసుకెళ్లాయి. తీవ్ర గాయాలతో ఫాంటమ్​ ప్రాణాలు కోల్పోయింది. ఫాంటమ్​ ధైర్యసాహసాలు, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరువలేనివని వైట్​ నైట్​ కార్ప్స్​ పేర్కొంది.

2020 మే 25న జన్మించిన బెల్జియం మాలినోయిస్ శునకం ఫాంటమ్​.

యాంటీ టెర్రరిస్ట్​ ఆపరేషన్..

ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్​లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టామని, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ తెలిపింది.

జమ్ము ప్రాంతంలోని అఖ్నూర్ సెక్టార్​లో సోమవారం ఉదయం ఆర్మీ కాన్వాయ్​ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఆ తర్వాత ప్రత్యేక బలగాలు, ఎన్​ఎస్​జీ కమాండోలు ఆపరేషన్ ప్రారంభించారని అధికారులు తెలిపారు.

ఖౌర్​లోని భట్టల్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి జోగ్వాన్ గ్రామంలోని అసన్ ఆలయం సమీపంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ నిఘా, బందోబస్తును పటిష్టం చేయడానికి సైన్యం తన నాలుగు బీఎంపీ-2 పదాతిదళ యుద్ధ వాహనాలను రంగంలోకి దింపింది.

జమ్ముకశ్మీర్​లోని అఖ్నూర్​లోని బత్తల్ ప్రాంతంలోని అసన్ మందిర్ సమీపంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నామని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఆర్మీ అంబులెన్స్​పై వారు కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.

దీంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆర్మీ దళాలు వేగంగా ఎదురుకాల్పులు జరపడంతో దాడి ప్రయత్నాన్ని భగ్నం చేశామని వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది.

“#Sunderbani సెక్టార్​లోని #Asan సమీపంలో ఉదయం ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాన్వాయ్​పై కాల్పులు జరిపారు. సొంత బలగాలు వేగంగా ఎదురుకాల్పులు జరపడంతో ఎలాంటి గాయాలు కాకుండా, ఉగ్రవాదుల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాము, ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాము,” అని వైట్ నైట్ కార్ప్స్ పోస్ట్ చేసింది.

అయితే ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో సైనికులకు ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.