Centre on Kohinoor : ‘కోహినూర్ను ఇండియాకు తీసుకొస్తాము’- కేంద్రం
Centre on Kohinoor : కోహినూర్ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని కేంద్రం చెప్పింది. కొన్నేళ్లుగా ఈ విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వం వద్ద ప్రస్తావిస్తున్నామని వెల్లడించింది.
Centre on Kohinoor : ప్రపంచంలోనే అత్యంత విలువైన 'కోహినూర్'ను బ్రిటన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్రం వెల్లడించింది. కోహినూర్ను వెనక్కి తీసుకు రావడానికి ఉన్న అని మార్గాలను అన్వేషిస్తామని పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత ఈ కోహినూర్ వ్యవహారం మళ్లీ వార్తల్లో నిలిచింది. కోహినూర్ను ఇండియాకు తీసుకురావాలని డిమాండ్లు మళ్లీ పెరిగాయి. ఈ విషయంలో తాజాగా విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిదమ్ బగ్చి స్పందించారు.
"కొన్నేళ్ల క్రితమే పార్లమెంట్లో.. ఈ విషయంపై కేంద్రం తన వైఖరిని స్పష్టంగా చెప్పింది. బ్రిటన్ ప్రభుత్వంతో కోహినూర్ విషయాన్ని ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. కోహినూర్ను ఇండియాకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాము," అని ఆరిందమ్ బగ్చి తెలిపారు.
బ్రిటన్లో 'కోహినూర్'..
Kohinoor diamond India : 1849 వరకు కోహినూర్ ఇండియాలోనే ఉండేది. మహారాజ దులీప్ సింగ్.. 108 క్యారెట్ కోహినూర్ను క్వీన్ విక్టోరియాకు బహుమతిగా ఇచ్చారని కొందరు చెబుతూ ఉంటారు. 1937 క్వీన్ తల్లి దానిని ధరించారు.
ఎలిజబెత్ మరణం అనంతరం కోహినూర్ ఉన్న కిరీటం ఎవరికి దక్కుతుంది? అన్న అంశంపై తీవ్ర చర్చలు జరిగాయి. అందుకు తగ్గట్టుగానే సామాజిక మాధ్యమాల్లో ‘కోహినూర్’ ట్రెండింగ్గా మారింది. అయితే.. కోహినూర్పై 100శాతం హక్కులు ఇండియాకే ఉన్నాయని, దానిని తిరిగి ఇచ్చేయాలని వేలాది మంది ట్వీట్ల వర్షం కురిపించారు. ఫలితంగా ఈ కోహినూర్ వ్యవహారం అప్పటి నుంచి హాట్టాపిక్గా మారింది.
అయితే ఈ కోహినూర్ డైమండ్పై అనేక కథలు ఉన్నాయి. ఇది పూరీ జగన్నాథుడికి చెందినదని పలువురు అభిప్రయాపడుతున్నారు.
"ఆ కోహినూర్ డైమండ్ శ్రీ జగన్నాథుడికి చెందినది. మహారాజా రంజిత్ సింగ్.. దానిని జగన్నాథ భగవానుడికి విరాళంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు అది క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద ఉంది. దానిని వెనక్కి తీసుకురావాలని మీరు ప్రధానికి విజ్ఞప్తి చేయండి," అని గత నెలలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించిన మెమొరాండమ్లో పేర్కొంది ఒడిశాకు చెందిన శ్రీ జగన్నాథ్ సేన.
Kohinoor history : చరిత్రకారుల ప్రకారం.. పంజాబ్ మహారాజు రంజిత సింగ్, అఫ్గానిస్థాన్ రాజు నదీర్ షాపై యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో గెలిస్తే పూరీ జగన్నాథుడికి కోహినూర్ని విరాళంగా ఇస్తానని ఆయన మొక్కుకున్నారు. నదీర్ షాపై జరిగిన యుద్ధంలో ఆయన విజయం సాధించారు. కానీ.. కోహినూర్ని పూరీ జగన్నాథుడికి ఇవ్వలేదు!
1839లో రాజా రంజిత్ సింగ్ మరణించారు. 10ఏళ్ల తర్వాత.. రంజిత్ సింగ్ కుమారుడు దులీప్ సింగ్ నుంచి బ్రిటీషర్లు ఆ కోహినూర్ డైమండ్ను తీసుకుని ఇంగ్లాండ్కు పట్టుకెళ్లిపోయారని కొందరు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి అది ఇండియాకు తిరిగిరాలేదు.
సంబంధిత కథనం
టాపిక్