పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో.. పాక్ తో సంబంధాలపై భారత్ 5 కఠిన నిర్ణయాలు-india acts tough against pak over pahalgam attack suspends indus waters treaty ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో.. పాక్ తో సంబంధాలపై భారత్ 5 కఠిన నిర్ణయాలు

పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో.. పాక్ తో సంబంధాలపై భారత్ 5 కఠిన నిర్ణయాలు

Sudarshan V HT Telugu

కశ్మీర్లోని పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్ తో సంబంధాల విషయంలో భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి, తక్షణమే సింధు జలాల ఒప్పందం రద్దు.

పాక్ తో సంబంధాలపై భారత్ 5 కఠిన నిర్ణయాలు (Shrikant Singh)

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, అట్టారీ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును మూసివేయడం, మొత్తం హైకమిషన్ల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించడం వంటి కఠిన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు.

ప్రధాని మోదీ సమీక్ష

ఈ దాడి సమాచారం తెలియగానే ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని బుధవారం ఉదయం భారతదేశానికి తిరిగి వచ్చారు. రాగానే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. జమ్మూకశ్మీర్లో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి దిశగా జమ్మూకశ్మీర్ నిలకడగా పురోగమిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సీసీఎస్ పేర్కొంది.

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతిస్పందన

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతిస్పందనగా పాకిస్తాన్ తో సంబంధాల విషయంలో భారత్ 5 కఠిన నిర్ణయాలను ప్రకటించింది. అవి

  1. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును ఉపసంహరించుకునే వరకు 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తారు.
  2. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు అట్టారిని తక్షణమే మూసివేస్తారు. చెల్లుబాటు అయ్యే ఎండార్స్మెంట్లతో భారత్ లోకి వచ్చినవారు 01 మే 2025 లోపు అదే మార్గం ద్వారా తిరిగి వెళ్లాలి.
  3. సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని (ఎస్వీఈఎస్) నిలిపివేసింది. ఈ వీసాల కింద ఇకపై పాకిస్థాన్ పౌరులు భారత్ రావడానికి వీల్లేదు. పాకిస్థాన్ జాతీయులకు గతంలో జారీ చేసిన ఎస్వీఈఎస్ వీసాలను తక్షణమే రద్దు అయినట్లుగా భావించాలి. ప్రస్తుతం ఎస్వీఈఎస్ వీసా కింద భారత్ లో ఉన్న ఏ పాకిస్థానీ పౌరుడైనా 48 గంటల్లోగా భారత్ విడిచి వెళ్లాలి.
  4. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లోని డిఫెన్స్/మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అడ్వైజర్లను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించారు. వారు వారం రోజుల్లోగా భారతదేశం విడిచి వెళ్ళాలి. అలాగే, ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ నుంచి భారత్ తన సొంత డిఫెన్స్/నేవీ/ఎయిర్ అడ్వైజర్లను ఉపసంహరించుకుంటుంది. ఆయా హైకమిషన్లలో ఈ పోస్టులను రద్దు చేస్తున్నట్లు పరిగణిస్తారు. రెండు హైకమిషన్ల నుంచి సర్వీస్ అడ్వైజర్స్ కు చెందిన ఐదుగురు సహాయక సిబ్బందిని ఉపసంహరించుకోనున్నారు.
  5. 01 మే 2025 నాటికి అమల్లోకి వచ్చే మరిన్ని తగ్గింపుల ద్వారా హైకమిషన్ల మొత్తం సంఖ్యను ప్రస్తుతమున్న 55 నుంచి 30కి తగ్గించనున్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.