Assam Woman Murdered : అసోంలో దారుణం- తల్లిని చంపి, పసికందును అపహరించి..
Assam Woman Murdered : వారి బిడ్డకు పెళ్లైంది. కానీ ఆమెకు సంతానం లేదు. బిడ్డ సంతోషం కోసం ఆ దంపతులు దారుణానికి ఒడిగట్టారు. వేరే మహిళను చంపి, ఆ తల్లి వద్ద ఉన్న 10నెలల పసికందును అపహరించారు. ఈ నేరంలో.. బాధితురాలి తల్లి పాత్ర కూడా ఉంది! అసోంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Assam Woman Murdered : అసోంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి నుంచి బిడ్డను వేరు చేసి, పసికందును తమ కూతురికి ఇచ్చేందుకు దంపతులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తల్లిని చంపేశారు. బాధితురాలి తల్లి కూడా ఈ నేరంలో పాలుపంచుకోవడం గమనార్హం.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
నితుమోని లుఖురంఖోన్ అనే మహిళ ఇటీవలే ఓ బిడ్డకు జన్మించింది. 10నెలల పసికందుతో కలిసి కేందుగురి బైలుంగ్ గ్రామంలో నివాసముంటోంది. గత సోమవారం సాయంత్రం.. సిమలుగురి మార్కెట్ నుంచి వీరిద్దరు కనిపించకుండాపోయారు. మంగళవారం ఉదయం.. నితుమోని మృతదేహం.. చరైదియో జిల్లాలోని రాజాబరి టీ ఎస్టేట్ డ్రైనేజ్లో కనిపించింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సిమలుగురి, సివసాగర్, చరైదియో, జోర్హాట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ను నిర్వహించి.. జోర్హాట్లో 10నెలల పసికందును స్వాధీనం చేసుకున్నారు.
Assam crime news : ఈ క్రమంలోనే నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో దంపతులు, వారి కుమారుడు, బాధితురాలి తల్లి ఉన్నారు. అసలేం జరిగిందన్న విషయం.. పోలీసుల విచారణలో బయటపడింది.
దంపతులు ప్రనాలి గగోయ్(హిరామై), బసంత గగోయ్లకు ఓ బిడ్డ ఉంది. పెళ్లి జరిగిన తర్వాత ఆమె హిమచల్ ప్రదేశ్లో నివాసముంటోంది. కానీ ఆమెకు సంతానం లేదు. ఆమెకు బిడ్డను ఇచ్చేందుకే.. నితుమోనిని చంపేశారు ఆ దంపతులు!
"ఇదొక ప్రీప్లాన్డ్ మర్డర్. ఏదో పని మీద.. దంపతులు బాధితురాలని పిలిపించారు. వారి కుమారుడు ప్రశాంత గగోయ్ కూడా అక్కడే ఉన్నాడు. బిడ్డను తల్లి నుంచి వేరు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే తల్లిని బలమైన ఆయుధంతో కొట్టారు. ఫలితంగా ఆమె మరణించింది. ఆ పసికందుతో ప్రశాంత గగోయ్ హిమాచల్ ప్రదేశ్కు బయలుదేరాడు. మేము దంపతులను అరెస్ట్ చేసే సమయానికి అతను ట్రైన్ ఎక్కేశాడు. ఆ తర్వాత.. ట్రైన్లోనే ఆతడిని అరెస్ట్ చేశాము. ఈ నేరంలో బాధితురాలి తల్లి బోబి లుఖురంఖోన్ పాత్ర కూడా ఉంది," అని శివసాగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి శుభ్రజ్యోతి బరోహ్ వెల్లడించారు.
Woman killed in Assam : నలుగురు నిందితులను పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. వారిని కస్టడీకి పంపిస్తూ.. కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో నివాసముంటున్న దంపతుల కుమార్తెకు.. ఈ నెరంతో ఏమైనా సంబంధం ఉందా? లేదా ఆమెకు తెలియకుండానే వారు ఈ విధంగా చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనం