దేశంలోని ఈ వారం వాతావరణ అప్డేట్స్ ఇచ్చింది ఐఎండీ (భారత వాతావరణశాఖ). మే 1 వరకు పంజాబ్, హరియాణా, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అయితే దిల్లీ-ఎన్సీఆర్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ్బెంగాల్, బిహార్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
దిల్లీ ఎన్సీఆర్లో ఆదివారం ఆకాశం మేఘావృత్తమై ఉంటుంది. వడగాల్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిన మరుసటి రోజే ఈ పరిస్థితులు కనిపించడం ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చే విషయం.
దిల్లీలో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని, ఆదివారం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటుందని, ఇది సాధారణం కంటే 1 - 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.
సోమవారం రాజధాని నగరంలో అప్పుడప్పుడు ఉపరితల గాలులతో ప్రధానంగా నిర్మలమైన ఆకాశం కనిపిస్తుంది. దిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
మే 1 వరకు పంజాబ్, హరియాణాల్లో హీట్వేవ్ పరిస్థితులు ఉంటాయని, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మే 2 వరకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏప్రిల్ 27-28 తేదీల్లో జమ్ము వేడిగా ఉంటుంది.
బిహార్, ఝార్ఖండ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, గుజరాత్లలో మే 1 వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
సంబంధిత కథనం