దక్షిణ భారతంలో వర్షాలు.. ఉత్తరాన కొన్ని చోట్ల భానుడి భగభగలు- ఐఎండీ అలర్ట్​!-imd warns of heatwave in north rains in ap and south india full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దక్షిణ భారతంలో వర్షాలు.. ఉత్తరాన కొన్ని చోట్ల భానుడి భగభగలు- ఐఎండీ అలర్ట్​!

దక్షిణ భారతంలో వర్షాలు.. ఉత్తరాన కొన్ని చోట్ల భానుడి భగభగలు- ఐఎండీ అలర్ట్​!

Sharath Chitturi HT Telugu

మే 1 వరకు ఉత్తర భారతంలోని పలు చోట్ల భానుడి భగభగలు విపరీతంగా ఉంటాయని, దక్షిణ, ఈశాన్య భారతంలో మాత్రం వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు అలర్ట్​ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

దిల్లీలో పర్యాటకులు (RAJ K RAJ /HT PHOTO)

దేశంలోని ఈ వారం వాతావరణ అప్డేట్స్​ ఇచ్చింది ఐఎండీ (భారత వాతావరణశాఖ). మే 1 వరకు పంజాబ్, హరియాణా, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అయితే దిల్లీ-ఎన్​సీఆర్​లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఉత్తర్​ప్రదేశ్, పశ్చిమ్​బెంగాల్, బిహార్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

దిల్లీ ఎన్​సీఆర్​లో వాతావరణం ఇలా..

దిల్లీ ఎన్​సీఆర్​లో ఆదివారం ఆకాశం మేఘావృత్తమై ఉంటుంది. వడగాల్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిన మరుసటి రోజే ఈ పరిస్థితులు కనిపించడం ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చే విషయం.

దిల్లీలో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని, ఆదివారం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటుందని, ఇది సాధారణం కంటే 1 - 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.

సోమవారం రాజధాని నగరంలో అప్పుడప్పుడు ఉపరితల గాలులతో ప్రధానంగా నిర్మలమైన ఆకాశం కనిపిస్తుంది. దిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

మే 1 వరకు పంజాబ్, హరియాణాల్లో హీట్​వేవ్​ పరిస్థితులు ఉంటాయని, రాజస్థాన్, మధ్యప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో మే 2 వరకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏప్రిల్ 27-28 తేదీల్లో జమ్ము వేడిగా ఉంటుంది.

బిహార్, ఝార్ఖండ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, గుజరాత్లలో మే 1 వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

  • రానున్న ఆరు రోజుల పాటు ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదివారం అసోం, మేఘాలయలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
  • మధ్యప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్, విదర్భ, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 30 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • పశ్చిమ్​ బెంగాల్, విదర్భ, ఛత్తీస్​గఢ్, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్​లో ఏప్రిల్ 30 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
  • రాగల ఆరు రోజుల్లో కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • ఏప్రిల్ 29, 30 తేదీల్లో కేరళ, మాహేలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.