Heavy rains alert : ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్​!-imd issues orange alert in these states ahead of festival season full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Imd Issues Orange Alert In These States Ahead Of Festival Season. Full Details

Heavy rains alert : ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్​!

Sharath Chitturi HT Telugu
Sep 19, 2022 04:51 PM IST

Rains in India : దేశంలో విస్త్రతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​ (Hindustan Times)

Heavy rains alert : దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ (భారత వాతావరణ శాఖ). అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. పండుగ సీజన్​ కోసం దేశం సన్నద్ధమవుతున్న వేళ.. వర్షాలపై ఐఎండీ అలర్ట్​ జారీ చేయడం గమనార్హం.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఒడిశా, ఆంధ్రప్రదేశ్​ తీర ప్రాంతం, ఛత్తీస్​గఢ్​లో ఈ నెల 21 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్​లో మంగళవారం నుంచి 22వ తేదీ వరకు వర్షాలు పడతాయి. సంబంధిత రాష్ట్రాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ.

Rains in North India : ఐఎండీ అలర్ట్​..

ఈ నెల 19 నుంచి 21 వరకు ఒడిశా, ఛత్తీస్​గఢ్​లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఝార్ఖండ్​లో ఈ నెల 20న, పశ్చిమ్​ బెంగాల్​లో సోమవారం, విదర్భాలో 21-22 తేదీల్లో, తూర్పు మధ్యప్రదేశ్​లో 20-23 మధ్య వానలు విస్తృతంగా పడతాయి.

పశ్చిమ మధ్యప్రదేశ్​లో ఈ నెల 22-23 మధ్యలో వర్షాలు కురుస్తాయి. గుజరాత్​, మరాఠావాడా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్​ ప్రాంతాలు, ఉత్తర కోంకణ్​లో సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Rains in Andhra Pradesh : ఇక ఆంధ్రప్రదేశ్​ తీర ప్రాంతం, యానాంలో 19,20న భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో 19-21 మధ్యలో వానలు పడతాయి.

ఉత్తరాఖండ్​లో సోమవారం, ఆగ్నేయ ఉత్తర్​ప్రదేశ్​లో 21న జోరుగా వర్షాలు కురుస్తాయి.

Rain alert to Northeast India : ఈశాన్య భారతంలో ఇలా..

Assam rains : అరుణాచల్​ప్రదేశ్​లో ఈ నెల 20 నుంచి 23 వరకు, అసోం- మేఘాలయ వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి. నాగాలాండ్​, మణిపూర్​, మిజోరాం, త్రిపురలో ఈ నెల 19-20 మధ్యలో వర్షాలు కురుస్తాయి.

అరుణాచల్​ప్రదేశ్​లో ముఖ్యంగా ఈ నెల 22-23 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం