Bagmati Express : గూడ్స్​ రైలును భాగమతి ఎక్స్​ప్రెస్​ ఎలా ఢీకొట్టింది? అసలేం జరిగింది?-how mysuru darbhanga bagmati express train collided goods carriage near chennai official explains ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bagmati Express : గూడ్స్​ రైలును భాగమతి ఎక్స్​ప్రెస్​ ఎలా ఢీకొట్టింది? అసలేం జరిగింది?

Bagmati Express : గూడ్స్​ రైలును భాగమతి ఎక్స్​ప్రెస్​ ఎలా ఢీకొట్టింది? అసలేం జరిగింది?

Sharath Chitturi HT Telugu
Oct 12, 2024 12:15 PM IST

Bagmati express accident today news : మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్​ప్రెస్ చెన్నై సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు గాయపడగా, 12 బోగీలు పట్టాలు తప్పాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది?

రైలు ప్రమాదం ఎలా జరిగింది? అధికారులు ఏం చెబుతున్నారు?
రైలు ప్రమాదం ఎలా జరిగింది? అధికారులు ఏం చెబుతున్నారు? (PTI)

మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్ గూడ్స్​ రైలును ఢీకొట్టిన ఘటనలో 19మంది గాయపడ్డారు. పొన్నేరి- కావరైపేట స్టేషన్ల మధ్య చెన్నై-గూడూరు సెక్షన్​లో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైలుకు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి.

మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్​ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణమేమిటి?

దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రైలు కవరైపెట్టైలో ఆగకూడదు. స్టేషన్ గుండా వెళ్లాల్సి ఉంది. చెన్నై నుంచి బయలుదేరిన తర్వాత మైసూరు-దర్భాంగా ఎక్స్​ప్రెస్ సిగ్నల్స్​ను డ్రైవర్ సరిగ్గానే ఫాలో అయ్యాడు. అయితే రైలు మెయిన్ లైన్​లో వెళ్లకుండా పొరపాటున లూప్​లైన్​కు మారడంతో, అందులో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.

ఇలా ఎందురు జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

"కవరైపేట్టై స్టేషన్​లోకి ప్రవేశించే సమయంలో, రైలు సిబ్బంది భారీ కుదుపును ఎదుర్కొన్నారు. ఇచ్చిన సిగ్నల్ ప్రకారం ప్రధాన మార్గంలోకి వెళ్లడానికి బదులుగా, గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న రైలు లూప్ లైన్​లోకి ప్రవేశించింది. లూప్ లైన్​లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఈ ఎక్స్​ప్రెస్​ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది,' అని మరో అధికారి తెలిపారు.

ఇదీ చూడండి:- Bagmati Express: గూడ్స్ రైలును ఢీకొన్న భాగ్ మతి ఎక్స్ ప్రెస్; పట్టాలు తప్పిన రెండు బోగీలు

మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్​ప్రెస్ ప్రమాదం తాజా అప్డేట్స్..

మైసూరు-దర్భాంగా భాగమతి ఎక్స్​ప్రెస్​ ప్రయాణికులతో కూడిన ప్రత్యేక రైలు శనివారం ఉదయం డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది.

తెల్లవారుజామున 4:45 గంటలకు రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రయాణికులకు ఆహారం, నీరు అందించినట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్​లో హెల్ప్ డెస్క్​ని ఏర్పాటు చేసి బాధిత ప్రయాణికులకు అధికారులు సహాయం అందించారు.

ఈ రైళ్ల రద్దు..

మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్​ప్రెస్ ప్రమాదం తర్వాత రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం మొత్తం సెక్షన్​లో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. రెండు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరో అరడజనుకు పైగా ట్రైన్స్​ని దారి మళ్లించారు.

ఈ రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ధృవీకరించారు:

• రైలు నంబర్ 12077 డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ - విజయవాడ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్

• రైలు నంబర్ 12078 విజయవాడ - డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్.

మరికొన్ని రైళ్లను శుక్రవారం రాత్రికి రాత్రే దారి మళ్లించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.