పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ!?.. సీజ్ ఫైర్ కు ముందు ఏం జరిగింది?-how india pakistan reached a ceasefire does pak requested the us to negotiate ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ!?.. సీజ్ ఫైర్ కు ముందు ఏం జరిగింది?

పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ!?.. సీజ్ ఫైర్ కు ముందు ఏం జరిగింది?

Sudarshan V HT Telugu

పరస్పర దాడులకు విరామం ప్రకటిస్తూ భారత్, పాకిస్తాన్ లు కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా ప్రకటించింది. అయితే, ఈ కాల్పుల విరమణను మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అమెరికాను కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ (AFP)

కాల్పుల విరమణ కు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభ్యర్థించిందని సమాచారం. ఐఎంఎఫ్ రుణం విషయంలో పాక్ కు అమెరికా సపోర్ట్ చేయాలంటే బేషరతుగా కాల్పుల విరమణకు ముందుకు రావాలని ట్రంప్ పాకిస్తాన్ కు స్పష్టం చేసినట్లు సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

కాల్పుల విరమణకు ముందు ఏం జరిగింది?

సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

  • భారత్ దాడులతో తీవ్ర స్థాయిలో నష్టపోతున్న పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఏకపక్షంగా ముందుకు వచ్చింది.
  • ఉద్రికత్తలు తగ్గించాలని కోరుతూ ఫోన్ చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం జరపాలని విన్నవించింది.
  • ఐఎంఎఫ్ నుంచి రుణం పొందే విషయంలో మద్ధతు కోరుతూ పాకిస్తాన్ చేసిన అభ్యర్థన సందర్భంగా.. ఏకపక్షంగా, బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించాలని పాక్ కు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ షరతు విధించారు.
  • భారత్ తో శత్రుత్వాన్ని నిలిపివేయాలని ట్రంప్ పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చారు. అలా చేస్తేనే, ఐఎంఎఫ్ రుణం విషయంలో మద్ధతు ఇస్తామని స్పష్టం చేశారు.
  • అనంతరం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధానులు, విదేశాంగ మంత్రులు, జాతీయ భద్రత సలహాదారులతో మాట్లాడారు.
  • ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కు స్వయంగా ఫోన్ చేశారు.
  • కాల్పుల విరమణ ప్రతిపాదనను భారత డీజీఎంఓ ముందు ఉంచారు.
  • తక్షణమే తాము పూర్తి స్థాయిలో, బేషరతుగా కాల్పుల విరమణకు, వైమానిక దాడులను ఆపేయడానికిి సిద్ధంగా ఉన్నట్లు భారత డీజీఎంఓకు పాక్ డీజీఎంఓ తెలిపారు.

భారత్ ప్రతిస్పందన

దాంతో, కాల్పుల విరమణ ప్రతిపాదను అంగీకారం తెలిపింది. అయితే, భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి జరిగినా యుద్ధ చర్యగానే చూస్తామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు సంబంధించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సహా భారత ఉన్నతాధికారులతో అమెరికా, ఇతర దేశాల ప్రతినిధులు మాట్లాడారని, అయితే భారత్, పాకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కానీ, ఎన్ఎస్ఏల మధ్య కానీ ఎలాంటి సంప్రదింపులు జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడితో..

ఇదంతా ఏప్రిల్ 22 తేదీ ఉదయం పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో ప్రారంభమైందని, దీనికి భారత్ ప్రతిస్పందించిందని, పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ లక్షిత దాడులకు దిగిందని, అప్పటి నుంచి పాక్ దూకుడుకు భారత్ బాధ్యతాయుతంగా మాత్రమే స్పందించిందని అమెరికాకు భారత్ వివరించింది. ఆపరేషన్ సిందూర్ ఏకైక లక్ష్యం ఉగ్రవాదంపై దాడి చేయడమేనని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు శిక్ష పడకుండా ఉండదన్న సందేశాన్ని పంపడమేనని, భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి జరిగినా యుద్ధ చర్యగానే చూస్తామని చెప్పారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.