కాల్పుల విరమణ కు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభ్యర్థించిందని సమాచారం. ఐఎంఎఫ్ రుణం విషయంలో పాక్ కు అమెరికా సపోర్ట్ చేయాలంటే బేషరతుగా కాల్పుల విరమణకు ముందుకు రావాలని ట్రంప్ పాకిస్తాన్ కు స్పష్టం చేసినట్లు సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..
దాంతో, కాల్పుల విరమణ ప్రతిపాదను అంగీకారం తెలిపింది. అయితే, భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి జరిగినా యుద్ధ చర్యగానే చూస్తామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు సంబంధించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సహా భారత ఉన్నతాధికారులతో అమెరికా, ఇతర దేశాల ప్రతినిధులు మాట్లాడారని, అయితే భారత్, పాకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కానీ, ఎన్ఎస్ఏల మధ్య కానీ ఎలాంటి సంప్రదింపులు జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపారు.
ఇదంతా ఏప్రిల్ 22 తేదీ ఉదయం పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో ప్రారంభమైందని, దీనికి భారత్ ప్రతిస్పందించిందని, పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ లక్షిత దాడులకు దిగిందని, అప్పటి నుంచి పాక్ దూకుడుకు భారత్ బాధ్యతాయుతంగా మాత్రమే స్పందించిందని అమెరికాకు భారత్ వివరించింది. ఆపరేషన్ సిందూర్ ఏకైక లక్ష్యం ఉగ్రవాదంపై దాడి చేయడమేనని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు శిక్ష పడకుండా ఉండదన్న సందేశాన్ని పంపడమేనని, భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి జరిగినా యుద్ధ చర్యగానే చూస్తామని చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్