పంజాబ్‌లో హై అలర్ట్, పాఠశాలల మూసివేత - పరీక్షలు వాయిదా-high alert in punjab schools closed exams postponed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పంజాబ్‌లో హై అలర్ట్, పాఠశాలల మూసివేత - పరీక్షలు వాయిదా

పంజాబ్‌లో హై అలర్ట్, పాఠశాలల మూసివేత - పరీక్షలు వాయిదా

HT Telugu Desk HT Telugu

ఆపరేషన్ సింధూర్ సరిహద్దు దాటి శత్రువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఉద్రిక్తతలు సరిహద్దు ప్రాంతాలపై ప్రభావం చూపిస్తున్నాయి. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ స్కూళ్లు మూసి ఉంటాయి. పరీక్షలు వాయిదా వేశారు. ప్రజల జీవితంపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

సెలవు ప్రకటించడంతో పాఠశాలను విడిచి వెళుతున్న విద్యార్థులు (PTI)

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న తరువాత రెండు వారాలకు భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. భారత దేశం సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచింది.

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో పాలన యంత్రాంగం స్కూళ్లను మూసివేయాలని ఆదేశించింది. పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్‌సర్ మరియు గురుదాస్‌పూర్‌లలో బుధవారం అన్ని స్కూళ్లు మూసిశారు. పఠాన్‌కోట్‌లో స్కూళ్లు రాబోయే 72 గంటల పాటు మూసిఉంటాయి. ఫిరోజ్‌పూర్‌లో గురువారం, శుక్రవారం కూడా స్కూళ్లు తెరుచుకోవు. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని స్కూళ్లను మూసివేయాలని పరిపాలన విభాగం ఆదేశించింది.

పరీక్షలు కూడా వాయిదా

పరిస్థితి తీవ్రత దృష్ట్యా, ఐకె గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ మే 8 నుండి 10 వరకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. మే 12 నుండి పరీక్షలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.

గురుద్వారాలను తెరిచి ఉంచిన SGPC

సరిహద్దు ప్రాంతంలో నివసించే ప్రజల తరలింపు దృష్ట్యా, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తరన్‌తారన్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్ మరియు ముక్తసర్‌లలోని చారిత్రాత్మక గురుద్వారాలు తెరిచి ఉంచింది. ఇక్కడ ప్రజలకు వసతి మరియు లంగర్ ఏర్పాటు చేసింది. SGPC అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి అన్ని ప్రబంధక కమిటీలను సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కోరారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.